For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పానీ పూరి అమ్మి అండర్-19 జట్టులో చోటు: ఎవరీ యశస్వి జైస్వాల్‌

By Nageshwara Rao
The humble beginnings of India U19 cricketer Yashasvi Jaiswal

హైదరాబాద్: మనం కన్న కలలను సాకారం చేసుకునేందుకు ఒకానొక సమయంలో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అచ్చం అలాగే తన ఆశయాన్ని చేరుకునే క్రమంలో అహర్నిశలు కృషి చేశాడు. ఇందుకోసం పానీ పూరీలు అమ్మాడు. పడుకోవడానికి స్థలం లేక క్రికెట్‌ మైదానంలోని గుడారాల కింద ఆశ్రయం పొందాడు.

చివరకు అనుకున్నది సాధించాడు. అతనే శ్రీలంక పర్యటన కోసం భారత అండర్‌-19 జట్టుకు ఎంపికైన 17 ఏళ్ల యశస్వి జైస్వాల్‌. ఉత్తరప్రదేశ్‌లోని భాడోహికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వాడు యశస్వి జైస్వాల్‌. తండ్రి ఓ చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన యశస్వి జైస్వాల్‌ చిన్నప్పటి నుంచి క్రికెటే ప్రాణంగా పెరిగాడు. పదకొండేళ్ల వయసులోనే ఎప్పటికైనా టీమిండియాకు ఆడాలని కలలు కన్నాడు. దాని కోసం అమ్మానాన్నలను.. ఉన్న ఊరును వదిలి ముంబై చేరాడు. క్రికెట్ పట్ల యశస్వి జైస్వాల్‌‌కి ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి అడ్డుచెప్పలేదు.

ఓ డైరీలో పనికి కుదిరిన యశస్వి జైస్వాల్‌

ఓ డైరీలో పనికి కుదిరిన యశస్వి జైస్వాల్‌

ఉత్తర ప్రదేశ్ నుంచి ముంబైకి చేరుకున్న యశస్వి జైస్వాల్‌ ఓ డైరీలో పనికి కుదిరి స్థానికంగా క్రికెట్‌ ఆడడం మొదలెట్టాడు. అయితే రోజంతా ఆడి అలసి రాత్రి వేళ పడుకోవడంతో.. పడుకోవడానికే డైరీకి వస్తున్నాడంటూ అతన్ని కొన్నిరోజుల తర్వాత పని నుంచి తప్పించారు. అదే సమయంలో ముంబైలోని వర్లీలో ఉండే అతని మామ సంతోష్ అక్కడే ఉండే ఆజాద్‌ మైదానంలోని ముస్లిమ్‌ యునైటెడ్‌ క్లబ్‌ వాళ్ల గుడారాల్లో ఉండే ఏర్పాటు చేశాడు.

మూడేళ్ల పాటు ముస్లిమ్‌ యునైటెడ్‌ క్లబ్‌‌లో

మూడేళ్ల పాటు ముస్లిమ్‌ యునైటెడ్‌ క్లబ్‌‌లో

యశస్వి జైస్వాల్‌ మామ ముస్లిమ్‌ యునైటెడ్‌ క్లబ్‌‌లో మేనేజర్‌గా పనిచేస్తుండటంతో ఆయన అడగటంతో అందుకు వారు అంగీకరించారు. మూడేళ్ల పాటు జైశ్వాల్ అక్కడే ఉన్నాడు. ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఆ విషయాలను ఇంట్లో వాళ్లకు మాత్రం చెప్పలేదు. ఒకవేళ ఇంట్లో తెలిస్తే ఇక క్రికెట్ ఆడింది చాలు, ఉత్తర ప్రదేశ్‌కు వచ్చేయి అని పిలుస్తారామోనని. ఇంటి నుంచి అప్పుడప్పుడు వాళ్ల నాన్న డబ్బులు పంపించినా కూడా అవి ఏ మూలా సరిపోయేవి కాదు.

క్రికెట్‌ను మాత్రం అతను మానలేదు

క్రికెట్‌ను మాత్రం అతను మానలేదు

దీంతో తినడం కోసం సొంతంగా పనులు చేయడం మొదలెట్టాడు. పానీ పూరీ సైతం అమ్మాడు. ఓ షాపింగ్ దుకాణంలో కూడా పనిచేశాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రికెట్‌ను మాత్రం అతను మానలేదు. ఆటను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. స్థానిక టోర్నీల్లో పాల్గొంటూ సెంచరీల మీద సెంచరీలు బాదాడు. దాంతో స్థానికంగా జైశ్వాల్ పేరు మార్మోగింది. ఆ నోటా ఈ నోటా పడి అది చివరకు స్థానిక క్రికెట్‌ కోచ్‌ జ్వాలా సింగ్‌ చెవికి చేరింది.

జ్వాలా సింగ్‌ శిక్షణలో రాటుదేలిన యశస్వి

జ్వాలా సింగ్‌ శిక్షణలో రాటుదేలిన యశస్వి

దీంతో వేరే వారి ద్వారా యశస్వి గురించి తెలుసుకున్న జ్వాలా సింగ్‌ అతని ఆటను చూద్దామని మైదానానికి వచ్చాడు. డివిజన్-ఎ ఆటగాడి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని ఫోర్లు మీద ఫోర్లు సాధిస్తున్న యశస్వి ఆట చూసి అతడు ముగ్ధుడయ్యాడు. దీంతో జైశ్వాల్‌కు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకొని తనతో పాటు తీసుకెళ్లాడు. జ్వాలాసింగ్ శిక్షణలో రాటుదేలిన యశస్వి జైశ్వాల్ ముంబై అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. ముంబై అండర్-19 జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబరిచి ఈ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రీలంకలో పర్యటించే భారత అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు.

Story first published: Thursday, July 5, 2018, 12:36 [IST]
Other articles published on Jul 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+