
ఇనిస్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తే రూ. 3.2 కోట్లు
తాజాగా సోషల్ మీడియాలో కూడా కోహ్లీ ప్రచారం ఊపందుకుంది. ఏదైనా ఉత్పత్తి గురించి కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తే దానికి సుమారు రూ. 3.2 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. కోహ్లీని ఇనిస్టాగ్రామ్ ఖాతాలో 16.7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

ఒక్క రోజుకు రూ 2.5 నుంచి రూ 4 కోట్లు
ఇక సాధారణ యాడ్ల విషయానికి వస్తే ఒక్క రోజుకు గాను రూ.2.5 నుంచి రూ.4 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తిరువనంతపురం వేదికగా మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో కోహ్లీసేన 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2-1తో కివీస్పై సిరిస్ గెలిచిన కోహ్లీసేన
దీంతో మూడు టీ20ల సిరిస్ను 2-1తో సొంతం చేసుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ని 8 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కోహ్లీసేనను బ్యాటింగ్కు ఆహ్వానించింది. దీంతో నిర్ణీత 8 ఓవర్లలో భారత్ 5 వికెట్లకు 67 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ (8), శిఖర్ ధావన్ (6), విరాట్ కోహ్లీ (13), అయ్యర్ (6), మనీష్ పాండే (17), హార్థిక్ పాండే (14) పరుగులు చేశారు.

బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
ఆ తర్వాత కివీస్ 8 ఓవర్లలో 6 వికెట్లకు 61 పరుగులే చేసింది. గ్రాండ్హోమీ (17 నాటౌట్), ఫిలిప్స్ (11) మినహా మిగతా వారు విఫలమయ్యారు. వర్షం ఆగిన 20 నిమిషాల్లోనే కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) గ్రౌండ్ను సిద్ధం చేయడం విశేషం. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.


Click it and Unblock the Notifications











