దుబాయ్: శ్రీలంకలో జరిగిన ముక్కోణపు పోటీలో చూపిన అద్భుతమైన ప్రతిభతో సచిన్ టెండూల్కర్ ఐసిసి ర్యాంకింగ్ లో టాప్ 10లో స్థానం దక్కించుకున్నాడు. ఐదు స్థానాలు ఎగబాకిన అతను ఏడో స్థానంలో నిలిచాడు. తాజాగా మంగళవారం వన్డే ర్యాంకింగ్ లను ఐసిసి విడుదల చేసింది. 14 నెలల తర్వాత అతను తిరిగి ఈ టాప్ టెన్ లో ప్రవేశించాడు. శ్రీలంకతో జరిగిన పైనల్ మ్యాచులో సెంచరీ సాధించాడు. ఇది వన్డేల్లో సచిన్ కు 44వ సెంచరీ. సిరీస్ లో అత్యధికంగా స్కోరు చేసిన బ్యాట్స్ మన్ గా కూడా సచిన్ నిలిచాడు. మొత్తం 211 పరుగులు సాధించాడు. ఇంగ్లాండతో నిరుడు నవంబర్ లో జరిగిన సిరీస్ తర్వా సచిన్ టాప్ 10లో స్థానాన్ని కోల్పోయాడు. మహేంద్ర సింగ్ ధోనీ యువరాజ్ సింగ్ కన్నా ముందంజలోనే ఉన్నాడు. బ్యాటింగ్ లో మహేంద్ర సింగ్ టాప్ లో నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ రెండేసి స్థానాలు కోల్పోయారు.