For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓలింపిక్ జ్యోతి ర్యాలీకి సచిన్ 'నో'

By Staff
Sachin Tendulkar
ముంబయి: ఓలింపిక్ జ్యోతి ర్యాలీలో భారత క్రికెట్ మాస్టర్ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ పాల్గొనడం లేదు. గాయం కారణంగా ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన నిర్ణయాన్ని టెండూల్కర్ భారత ఓలింపిక్ సంఘానికి తెలియజేసినట్లు సమాచారం. ఓలింపిక్ జ్యోతి బుధవారం పాకిస్తాన్ కు చేరుకుంది. రేపు భారత్ కు చేరుకుంటుంది.
చైనా రాజధాని బీజింగ్ లో ఆగస్టులో ఓలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓలింపిక్ జ్యోతిని ప్రపంచమంతటా తిప్పుతున్నారు. భారత్ లో ఓలింపిక్ జ్యోతి ఊరేగింపు మార్గాన్ని నిర్ణయించారు. ఈ జ్యోతిని విజయ్ పథ్, ఇండియా గేట్ ల మధ్య రెండున్నర కిలోమీటర్లు ఊరేగుతుంది. ఓలింపిక్ జ్యోతి ఊరేగింపునకు మూడు వేలమంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో లియాండర్ పేస్, పిటి ఉష, మానవ్ జిత్ సి౦గ్ స౦ధూ వంటి క్రీడాకారులతో పాటు అమీర్ ఖాన్, సైఫ్ అలి ఖాన్ వంటి సినీ కళాకారులు పాల్గొంటారు.
Story first published: Wednesday, April 16, 2008, 12:02 [IST]
Other articles published on Apr 16, 2008
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+