ముంబై: భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అడ్వైజరీ కమిటీలో మెంబర్స్గా చేరారు. ఈ విషయాన్ని సోమవారం బీసీసీఐ అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
భారత క్రికెట్కు సంబంధించి లెజెండరీ త్రయాన్ని అధికారికంగా ఇండియన్ క్రికెట్ బోర్డులో చేరినట్లు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ తన ట్విట్టర్లో బీసీసీఐ అడ్వైజరీ కమిటీలో మెంబర్స్గా ఈ ముగ్గురు చేరినట్లు సోమవారం ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో వీరి సలహాలు, గైడెన్స్తో బీసీసీఐ మరింతగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లు సంవత్సరాల పాటు టీమిండియాకు సేవలందించారు. ఇప్పుడు ఈ త్రయాన్ని యువతరానికి మార్గనిర్దేశం చేసేలా బీసీసీఐ ఉపయోగించుకోనుంది.