
గాయాలు మానిపోయాయి గానీ..
గడాఫీ స్టేడియంపై కాల్పుల ఘటనకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా రజా తన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. తన గాయాలు మానిపోయాయి గానీ.. నాటి పీడకలను మరిచిపోలేకపోతున్నానని చెప్పారు. ఆదివారం ఆయన తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. ఆ ఘటన తనను మాత్రమే కాదని, పాకిస్తాన్ క్రికెట్ ఉజ్వల భవిష్యత్తును కూడా నాశనం చేసిందని చెప్పారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు చెడ్డపేరు తీసుకొచ్చిందని, దశాబ్దం తరువాత కూడా క్రికెట్ ఆడే అనేక దేశాలు పాకిస్తాన్ లో పర్యటించడానికి విముఖత చూపుతున్నాయని రజా ఉద్ఘాటించారు.

పాక్ క్రికెట్ బోర్డు ఆదాయన్ని దెబ్బకొట్టిన ఉదంతం..
కాల్పుల ఉదంతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయాన్ని దారుణంగా దెబ్బతీసింది. స్వదేశంలో, సొంత గడ్డ మీద, సొంత ప్రేక్షకుల మధ్య హోరాహోరీగా తలపడాల్సిన మ్యాచ్ లను తటస్థ వేదికల్లో ఆడాల్సి వచ్చింది పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు. దీనివల్ల భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది. దీని విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. 2015లో జింబాబ్వేతో సిరీస్ ను పక్కన పెడితే.. ఈ దశాబ్ద కాలంలో స్వదేశంలో పాకిస్తాన్ ఆడిన అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లు నామమాత్రమే. 2015 నాటి జింబాబ్వే సిరీస్ తో అంపైర్ రజా మళ్లీ పునరాగమనం చేయడం గమనార్హం. న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలు మాత్రం పాక్ లో క్రికెట్ ఆడటానికి సాహసించట్లేదు. గత ఏడాది ఓ టీ20 సిరీస్ ను న్యూజీలాండ్ పాకిస్తాన్ లో ఆడాల్సి ఉంది. న్యూజీలాండ్ అంగీకరించకపోవడం తటస్థ వేదికలపై ఆ మ్యాచ్ లు ఏర్పాటయ్యాయి. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా అంతే. పాకిస్తాన్ తో ఆ దేశ సొంత గడ్డపై రెండు వన్డే మ్యాచ్ లను ఆడాల్సి ఉండగా.. ఆస్ట్రేలియా దీనికి అంగీకరించలేదు.

రెండేళ్లుగా పరిస్థితిలో మార్పు..
పాకిస్తాన్ లో క్రికెట్ ఆడే దేశాల సంఖ్య రెండేళ్లుగా క్రమంగా మెరుగుపడుతూ వస్తోంది. ఇటీవలే వెస్టిండీస్.. పాకిస్తాన్ లో మూడు టీ20 మ్యాచ్ లను ఆడింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచులు ఆ దేశ క్రికెట్ కు పునర్వైభవాన్ని తెచ్చి పెడుతున్నాయని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ ఆసిఫ్ ఇక్బాల్ చెప్పారు. సమీప భవిష్యత్తులో మరిన్ని జట్లు తమ దేశానికి వచ్చి క్రికెట్ ఆడతాయని ఆశిస్తున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications












