హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్లో భాగంగా రెండో టీ20 కోసం భారత జట్టు ఆటగాళ్లు గౌహతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియాకు అక్కడి విమానాశ్రయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రెండో టీ20కి గౌహతిలో కొత్తగా నిర్మించిన బర్సపురా స్టేడియం తొలిసారిగా అతిథ్యమిస్తోంది.
ఈ సందర్భంగా గౌహతికి చేరుకున్న టీమిండియాకు అక్కడి సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను భారత క్రికెట్ జట్టు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఏడేళ్ల తర్వాత జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో అభిమానులు క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున విమానాశ్రయానికి చేరుకుని క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. గౌహతిలో చివరిసారిగా నవంబర్ 28, 2010లో వన్డే మ్యాచ్ జరిగింది.
న్యూజిలాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 40 పరుగుల తేడాతో గెలిచింది. అస్సాం క్రికెట్ అసోసియేషన్ ఇటీవలే కొత్తగా 37,000 మంది సామర్థ్యం కలిగిన కొత్త స్టేడియాన్ని నిర్మించింది. రెండో టీ20కి సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి.
మూడు టీ20ల సిరిస్లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ సిరిస్లో చివరిదైన మూడో టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది.
A post shared by Team India (@indiancricketteam) on
Guwahati people welcomed us in there own Style.. loving it @hardikpandya93 @arunkanade 👌👌🙏🏼
A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on