హైదరాబాద్: త్వరలో టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు బయర్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఐర్లాండ్ జట్టుతో టీమిండియా రెండు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ రెండు టీ20లు జూన్ 27, 29 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లను ఏ ఛానెల్ ప్రసారం చేస్తుందో అనే దానిపై సగటు అభిమానిలో ఉత్కంఠ నెలకొంది.
ఐర్లాండ్తో జరిగే రెండు టీ20ల సిరిస్ను సంబంధించి ప్రసార హక్కులను సోనీ సంస్ధ దక్కించుకుంది. సోనీ సిక్స్, సోనీ టెన్ 3లో ఈ రెండు మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఐర్లాండ్లోని డబ్లిన్ వేదికగా ఈ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. సోనీ లైవ్ యాప్లో కూడా ఈ మ్యాచ్లను వీక్షించవచ్చు.
భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల నుంచి ఈ మ్యాచ్లు జరగనున్నాయి. మరోవైపు టీమిండియాతో తలపడే ఐర్లాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 మంది సభ్యులతో కూడిన జట్టును ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గ్యారీ విల్సన్ ఐర్లాండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
Just a few hundred tickets left for next Wednesday’s match. Don’t miss out - buy tickets online here: https://t.co/STcy20vzYW #BackingGreen pic.twitter.com/X8bkyxqx6i
— Cricket Ireland (@Irelandcricket) June 21, 2018
ఐర్లాండ్ పర్యటన ముగించుకున్న అనంతరం టీమిండియా సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. జులై 3 నుంచి ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
Only a few Hospitality Packages left at the T20 Internationals against India next week. Get in quick! https://t.co/G80tPwbbsz #BackingGreen pic.twitter.com/gJ7yOZNSDD
— Cricket Ireland (@Irelandcricket) June 20, 2018
భారత్తో తలపడే ఐర్లాండ్ జట్టు:
గ్యారీ విల్సన్ (కెప్టెన్), ఆండ్రూ బాల్బిర్ని, పీటర్ చేజ్, జార్జ్ డాక్రెల్, జాష్ లిటిల్, ఆండ్రూ మెక్బ్రైన్, కెవిన్ ఓబ్రియన్, విలియమ్ పోర్టర్ఫీల్డ్, స్టువర్ట్ పోయంటర్, బోయడ్ రాన్కిన్, జేమ్స్ షన్నాన్, సిమి సింగ్, పాల్ స్టిర్లింగ్, స్టువర్ట్ థాప్సన్.