For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బిజీబిజీగా టీమిండియా.. బంగ్లాదేశ్‌లో కోహ్లీసేన ప‌ర్య‌ట‌న‌! అభిమానులకు ఏడాదంతా పండగే!!

Team India to tour Bangladesh in 2022 for 2 Tests and 3 ODIs
India To Tour Bangladesh For 2 Tests & 3 ODIs In 2022 || Oneindia Telugu

ముంబై: సుదీర్ఘకాలం తర్వాత బంగ్లాదేశ్‌ గడ్డపై టీమిండియా అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది నవంబర్‌లో బంగ్లాలో కోహ్లీసేన ప‌ర్య‌టించ‌నున్నది. బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు, 3 వన్డేలు భారత్ ఆడనున్నది. ఈ మేరకు స్పోర్ట్స్ వెబ్‌సైట్ క్రికిన్‌ఫో ఓ కథనం వెల్ల‌డించింది. దీంతో వ‌చ్చే ఏడాది మొత్తం భార‌త జ‌ట్టు బిజీబిజీగా గ‌డ‌ప‌నున్న‌ది. టీమిండియా చివరిసారిగా 2015లో ఆ దేశంలో ప‌ర్య‌టించింది. వాయిదా పడిన బంగ్లా షెడ్యూల్‌నే భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు ఖరారు చేసింది.

వెస్టిండీస్ టూర్‌తో ఆరంభం:

వెస్టిండీస్ టూర్‌తో ఆరంభం:

గత సంవత్సరం కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా టీమిండియా బిజీ షెడ్యూల్ వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అనుకూలిస్తుండ‌టంతో.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభమ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని క్రికిన్‌ఫో తెలిపింది. వాయిదా వేసిన కార్యక్రమాలు రాబోయే రెండేండ్ల‌లో జరుగుతాయి. వచ్చే ఏడాది ఆరంభం నుంచి భారత జట్టుకు బిజీ షెడ్యూల్ ఉన్న‌ది. వెస్టిండీస్ జనవరిలో భారతదేశంలో పర్యటించి పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

శ్రీలంక, ఇంగ్లండ్ పర్యటనలు:

శ్రీలంక, ఇంగ్లండ్ పర్యటనలు:

వెస్టిండీస్ టూర్ తర్వాత శ్రీలంక బృందం ఫిబ్రవరి, మార్చిలో భారత పర్యటనకు రానున్న‌ది. శ్రీలంకతో 3 టెస్ట్ మ్యాచ్‌లు, 3 వన్డేల సిరీస్ ఆడ‌నున్న‌ది. అదే సమయంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటానికి భారత జట్టు జూన్, జూలైలో ఇంగ్లండ్ వెళ్తుంది. ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లను కోహ్లీసేన ఆడనుంది. అక్కడి నుంచి భారత్ వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. జూలై-ఆగస్టులో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేలా ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయి. ఆ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.

తీరికలేని క్రికెట్:

తీరికలేని క్రికెట్:

ఆసియా కప్ సెప్టెంబర్‌లో జరగనున్న‌ది. భారత జట్టు సెప్టెంబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాతో స్వదేశీ సిరీస్ ఆడనున్న‌ది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్లు 4 టెస్టులు, 3 వన్డేల సిరీస్ ఆడనున్నాయి. నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో ప‌ర్య‌టిస్తుంది. మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ఉంది. మొత్తానికి భారత జట్టు వచ్చే ఏడాది తీరికలేని క్రికెట్ ఆడనుంది. అప్పటివరకు కరోనా అదుపులోకి వస్తే.. ఈ పర్యటనలు అన్ని సజావుగా సాగుతాయి. లేదంటే అంతేసంగతులు.

బిజీగానే 2021:

బిజీగానే 2021:

2021లో భారత్ షెడ్యూల్ బిజీగానే ఉంది. జనవరిలో ఆస్ట్రేలియా పర్యటన, ఆవెంటనే స్వదేశంలో ఇంగ్లండ్ టూర్‌తో మూడు నెలల పాటు అన్ని ఫార్మాట్లు ఆడారు. ఇక ఏప్రిల్ ఆరంభంలో ఐపీఎల్ 2021తో మరింత బిజీ అయ్యారు. అయితే కరోనా కారణంగా సగం టోర్నీ వాయిదా పడడంతో.. ఇప్పుడు కాస్త సేదతీరుతున్నారు. అయితే ఐసీసీ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్ పర్యటనతో మళ్లీ ఆటతో బిజీ కానున్నారు. ఆపై కుదిరితే ఐపీఎల్ 2021 జరగనుంది. ఇక సెప్టెంబర్-నవంబర్ మాసాల్లో టీ20 ప్రపంచకప్ టోర్నీ ఉంది. మెగా టోర్నీ ఆతిధ్య హక్కులు మానవద్దే ఉన్నాయి. మొత్తానికి క్రికెట్ అభిమానులకు పండగనే చెప్పాలి.

Story first published: Tuesday, May 18, 2021, 19:29 [IST]
Other articles published on May 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+