Team India: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియాలో కెప్టెన్సీ విషయంలో కొత్త చర్చ మొదలైంది. శుభ్మన్ గిల్ను భవిష్యత్ టెస్ట్ కెప్టెన్గా భావిస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్ట్ కెప్టెన్సీకి పోటీదారుడిగా ఉన్నాడు. కానీ ఈ రేసులో బుమ్రా వెనుకబడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది క్రికెట్ నిపుణులు బీసీసీఐ ఎంపిక ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా మంచి ఎంపిక అని రవిచంద్రన్ అశ్విన్, సునీల్ గవాస్కర్ విశ్వసిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై ప్రశ్నలు లేవనెత్తారు.
బుమ్రా కెప్టెన్సీకి ఎంపిక కానప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు వైస్ కెప్టెన్గా ఎందుకు నియమించబడ్డాడనే దానిపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మంజ్రేకర్ తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ.. "టెస్ట్ కెప్టెన్గా బుమ్రా కాకుండా వేరే ఏదైనా ఎంపిక కోసం మనం చూస్తున్నామని తెలిసి నేను షాక్ అయ్యాను! బుమ్రా గాయాల గురించి ఆందోళన చెందుతున్నారా? అప్పుడు మీ వైస్ కెప్టెన్ను జాగ్రత్తగా ఎంచుకోండి." అంటూ రాసుకొచ్చాడు.

ఫిట్నెస్ సమస్యల కారణంగా వెనుకబడిన బుమ్రా
మూడేళ్ల క్రితం విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. రోహిత్ తర్వాత భవిష్యత్తులో ఈ బాధ్యతను చేపట్టగల ఆటగాళ్లలో బుమ్రా పేరు ఉంది. 2022లో ఇంగ్లాండ్తో జరిగిన బర్మింగ్హామ్ టెస్ట్కు బుమ్రాను కెప్టెన్గా నియమించారు. కానీ ఆ తర్వాత బుమ్రా అకస్మాత్తుగా రేసు నుంచి తప్పుకున్నాడు. రెండేళ్ల తర్వాత నవంబర్ 2024లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా భారత్కు ఏకైక విజయాన్ని అందించాడు.