
రెండో వన్డేలో కూడా..
గువాహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఉన్నట్లే.. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కూడా పిచ్ ఎక్కువగా బ్యాటింగ్కే సహకరిస్తుంది. ఇక్కడ ఇటీవలి కాలంలో మంచి హై స్కోరింగ్ మ్యాచ్లు జరిగాయి. దీంతో ఈ మ్యాచ్ కూడా కచ్చితంగా భారీ స్కోర్లు నమోదవుతాయిన మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. అలాగే భారత బ్యాటింగ్ విధానాన్ని అతను మెచ్చుకున్నాడు. పిచ్, వాతావరణం కనుక బౌలర్లకు సహకారం అందించకపోతే.. బ్యాటర్లు ఎక్కడైనా చెలరేగుతారని చోప్రా చెప్పాడు. ఇక్కడ కొత్త బంతికి కొంత స్వింగ్ దొరికే అవకాశం ఉందని చెప్పిన అతను.. ఆ తర్వాత ఇక పూర్తిగా బ్యాటర్లదే ఆధిపత్యం అని స్పష్టం చేశాడు.

వన్డే ఫార్మాట్ మారిపోయింది..
ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్లో చాలా మార్పులు వచ్చాయని చోప్రా అన్నాడు. మొదటి 7-10 ఓవర్లు కనుక జాగ్రత్తగా ఆడుకుంటే ఆ తర్వాత భారీ స్కోర్లు చెయ్యవచ్చన్నాడు. భారత్ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పాడు. వన్డేల్లో భారీ స్కోర్లు చేయడం ఇటీవలి కాలంలో రూల్గా మారిపోయిందన్నాడు. అలాగే ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు నమోదవుతాయని, ఈ మ్యాచ్ లో-స్కోరింగ్ అవుతుందని తాను అనుకోవడం లేదని తెలిపాడు. కేవలం బంగ్లాదేశ్ వంటి పూర్తి టర్నింగ్ ట్రాక్ ఉంటేనే స్కోర్లు తక్కువగా నమోదవుతాయని, లేదంటే ఎక్కడైనా భారీ స్కోర్లే నమోదవుతాయని తేల్చిచెప్పాడు.

టార్గెట్ 400..
తొలి వన్డేలో భారత జట్టు బ్యాటింగ్ను చోప్రా బాగా మెచ్చుకున్నాడు. గువాహతిలోని బర్సాపరా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా భారీ షాట్లు ఆడిందన్నాడు. 'బర్సాపరాలో భారత బ్యాటర్లు బాదేశారు. ఇంతకుముందు టీమిండియా ఆటతీరు మార్చుకోవాలని అనేవాళ్లం. ఇప్పుడు ఇంక ఏం మార్చుకోవాల్సిన అవసరం ఉంది? నిజానికి తొలి వన్డేలో 400 పరుగులు చేయాల్సింది. ఈడెన్ గార్డెన్స్లో కూడా 400 పరుగులు చేయొచ్చు. అది సాధ్యమే కదా. అలాంటప్పుడు 400 చెయ్యడమే టార్గెట్గా ఎందుకు పెట్టుకోకూడదు' అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.


Click it and Unblock the Notifications












