అన్నింట్లోనూ టీమిండియాదే విజయం
ఇప్పటివరకు ఐర్లాండ్తో టీమిండియా మూడు వన్డేలు, ఒక టీ20 ఆడగా అన్నింట్లోనూ టీమిండియాదే విజయం. ఐర్లాండ్తో జరిగే ఈ సిరీస్ను గెలుచుకుని ఇంగ్లాండ్ పర్యటనను ఘనంగా ఆరంభించాలని కోహ్లీసేన చూస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్కు ముందు ఐర్లాండ్ సిరీస్ను భారత్ చిన్నపాటి సన్నాహకంగా భావిస్తోంది.
టీ20ల్లో నంబర్వన్ స్థానంపై కన్నేసిన టీమిండియా
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన టీ20ల్లో కూడా నంబర్వన్ స్థానంపై కన్నేసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్ల్లో కోహ్లీసేన విజయం సాధిస్తే దాయాది దేశమైన పాకిస్థాన్ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఐర్లాండ్తో సిరీస్ను భారత్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.
జులై 3 నుంచి ఇంగ్లాండ్తో టీ20 సిరిస్
చిన్న జట్టే అయినప్పటికీ, ఆ జట్టులో కూడా కెవిన్, పోర్టర్ఫీల్డ్, స్టిర్లింగ్, డాక్రెల్ లాంటి నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఐర్లాండ్తో రెండు టీ20ల సిరిస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో జులై 3 నుంచి టీ20 సిరిస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది.

ముందు పరిమిత ఓవర్ల సిరిస్, తర్వాత టెస్టు సిరిస్
టెస్టు సిరీస్ ఆరంభమయ్యే సమయానికి అక్కడి పరిస్థితులకు టీమిండియా ఆటగాళ్లు అలవాటు పడేందుకు గాను సిరిస్ను ఇలా ప్లాన్ చేశారు. ఇంగ్లాండ్లో గత రెండు టెస్టు సిరీస్ల్లోనూ ఘోరంగా ఓటమిపాలైన టీమిండియా ఈసారి మాత్రం ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో ఉంది.
రాత్రి 8.30 నుంచి సోనీ సిక్స్లో


Click it and Unblock the Notifications












