న్యూఢిల్లీ : టీ-20, ఐపీఎల్ ఆ తర్వాత జింబాబ్వే టూర్ తో బిజిబిజీగా గడిపిన టీమ్ ఇండియా క్రికెటర్లు మరో బిజీ షెడ్యూల్ కి రెడీ అయ్యారు. వరుస మ్యాచ్ లతో క్రికెట్ ప్రేమికులను అలరించడానికి టీమ్ ఇండియా ఇప్పుడు సన్నద్దమవుతోంది. 2016-17 సీజన్ లో భాగంగా రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ లలో బిజి బిజీగా గడపనుంది టీమ్ ఇండియా.
సెప్టెంబర్ 22న న్యూజిలాండ్ తో మొదలవనున్న సిరీస్ అక్టోబర్ 29 వరకు కొనసాగనుంది. సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో 3 టెస్టులు, 5 వన్డేలు ఆడనుంది టీమ్ ఇండియా. ఇవిగాక 2016-17 సీజన్ కి గాను మొత్తం 13 టెస్టులు, 8 వన్డేలు, 3 టీ-20 మ్యాచ్ లతో క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఇక వేదికల విషయానికి వస్తే.. న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ లో చివరి వన్డేకు వైజాగ్ వేదికవడం విశేషం.
న్యూజిలాండ్ తో సిరీస్ అనంతరం ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో వరుసగా సిరీస్ లు ఆడనుంది టీమ్ ఇండియా. ఈ లెక్కన క్రికెట్ ఫ్యాన్స్ కి పండగ సీజనే అంటున్నాయి క్రికెట్ వర్గాలు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, టెస్ట్ సిరీస్ :
తొలి టెస్టు : సెప్టెంబర్ 22-26, కాన్పూర్
రెండో టెస్టు : సెప్టెంబర్ 30- అక్టోబర్ 4, ఇండోర్
మూడో టెస్టు మ్యాచ్ : అక్టోబర్ 8-12, కోల్కత్తా
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్:
మెదటి వన్డే : ధర్మశాల, అక్టోబర్ 16
రెండో వన్డే : ఢిల్లీ, అక్టోబర్ 19
మూడో వన్డే : మొహాలీ, అక్టోబర్ 23
నాలుగో వన్డే : రాంచీ, అక్టోబర్ 26
ఐదో వన్డే : వైజాగ్, అక్టోబర్ 29