హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్పై మ్యాచ్ గెలిచిన తర్వాత భారత జట్టు ఆటగాళ్లు లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. గురువారం శ్రీలంకతో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ చేయాల్సి ఉన్నప్పటికీ, భారీ వర్షం కారణంగా హోటల్ రూమ్స్కే క్రికెటర్లు పరిమితమయ్యారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
అయితే సాయంత్రానికి వర్షం తగ్గడంతో లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. జట్టు సభ్యులంతా కలిసి లంచ్, డిన్నర్ చేస్తూ గడిపారు. ఇక మంగళవారం తన 29వ బర్త్డే జరుపుకున్న రహానే.. భార్యతో కలిసి ప్రైవేట్ లంచ్కు వెళ్లాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ లో సందడి చేశాడు.
పనిలో పనిగా ఫ్యాన్స్తో సెల్ఫీలు, ఫొటోలకు పోజులిచ్చాడు. అటు కోచ్ కుంబ్లే మాత్రం తన భార్యతో కలిసి జాగింగ్ చేస్తూ కనిపించాడు. వర్షం కారణంగా మంగళవారం ప్రాక్టీస్లో పాల్గొనకపోవడంతో బుధవారం మధ్యాహ్నం టీమిండియా ప్రాక్టీస్ చేయనుంది.
ఇదిలా ఉంటే టోర్నీలో భాగంగా గురువారం భారత్, శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. లండన్లోని ఓవల్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా, పాక్ మ్యాచ్ అనంతరం సోమవారం ఆటగాళ్లు సంతోషంగా కోహ్లీ చారిటీ డిన్నర్కు హాజరైన సంగతి తెలిసిందే.