
టోర్నీ ప్రారంభించిందిలా..
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడిన మొదటి మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా .. రెండో మ్యాచులో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో రెండు కీలక విజయాలు నమోదు చేసింది. ఆ తర్వాత సౌతాఫ్రికా చేతిలో ఓడినప్పటికీ.. బంగ్లాదేశ్పై మరోసారి కోహ్లీ, రాహుల్ రాణించడంతో విజయం నమోదు చేసింది. దీంతో మూడు మ్యాచుల్లో గెలిచి ఆరు పాయింట్లతో నిలిచిన భారత్.. గ్రూప్-2 నుంచి సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

సౌతాఫ్రికా షాకర్..
సౌతాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్ సంచలనం నమోదు చేయడంతో ఈ గ్రూప్లో సమీకరణాలు మారిపోయాయి. సౌతాఫ్రికా, భారత్ సెమీస్ చేరతాయని, మిగతా జట్లకు ఛాన్స్ ఉన్నా అవి సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమేనని అంతా అనుకున్నారు. కానీ సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించడంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు తలుపులు తెరుచుకున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఆదివారం తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమస్లో చివరి బెర్తు దక్కించుకుంటుంది.

సెమీస్ చేరే రెండో జట్టు..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు జట్లూ చెరో 4 పాయింట్లతో ఉన్నాయి. ఆదివారం నాడు జరుగుతున్న మ్యాచ్లో గెలిచిన జట్టుకు మరో రెండు పాయింట్లు దక్కుతాయి. దాంతో 6 పాయింట్లతో ఆ జట్టు సెమీస్ చేరుకుంటుంది. ఇదే గ్రూప్లో 5 పాయింట్లతో ఉన్న సౌతాఫ్రికా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే ఆరు పాయింట్లతో ఉన్న భారత జట్టు సెమీస్ చేరినట్లే. జింబాబ్వేపై కూడా భారత్ గెలిస్తే గ్రూప్-2 టాపర్గా నిలుస్తుంది టీమిండియా. అంటే సెమీస్లో ఇంగ్లండ్తో తలపడుతుంది.


Click it and Unblock the Notifications












