1972లో కాండీలో జన్మించిన ముత్తయ్య
1972లో కాండీలో జన్మించిన ముత్తయ్య మురళీ ధరన్ 1992 నుంచి 2011 మధ్య కాలంలో శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తన బౌలింగ్ యాక్షన్తో క్రికెట్లో ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించాడు. 1996లో శ్రీలంక జట్టు ప్రపంచ ఛాంపియన్గా నిలవడంలో ముత్తయ్యదే కీలకపాత్ర.
డిసెంబర్, 2019 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం
"డిసెంబర్, 2019 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదొక పెద్ద బడ్జెట్ సినిమా, ఈ సినిమా మొత్తాన్ని భారత్లోనే చిత్రీకరించారు. శ్రీలంక, ఇంగ్లాండ్లలో సైతం కొంత సినిమాను తీస్తాం" అని సినిమాను రూపొందించే వారు ఇండియా టుడేతో చెప్పినట్లు సమాచారం. అయితే, ఈ సినిమాపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
తెలుగులో సైరాలో నటించిన విజయ్ సేతుపతి
విజయ్ సేతపతి ప్రస్తుతం 'సంగ తమిజాన్', 'కడైసయి వివసాయి' అనే తమిళ సినిమాతో పాటు తెలుగులో సైరా సినిమాలో నటిస్తున్నాడు. జూన్లో విడుదలైన తమిళ సినిమా 'సింధుబాద్' బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. ఇటీవలే 'మార్కోనీ మథాయి' అనే సినిమాతో మళయాళంలో అరంగేట్రం చేశాడు.
అభిమానులను అలరించిన క్రికెటర్ల బయోపిక్లు
కాగా, ఈ మధ్య కాలంలో విడుదలైన క్రికెటర్ల బయోపిక్లు అభిమానుల మనసు చూరగొన్నాయి. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, మహ్మద్ అజారుద్దీన్, మేరీ కోమ్, మిల్కా సింగ్, బాల్ థాకరీ వంటి వారిపై వచ్చిన సినిమాలు అభిమానులను అలరించాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ లెజెండ్గా పేరుగాంచిన ముత్తయ్యపై సినిమా ప్లాన్ చేశారు.