
హైదరాబాద్: కోహ్లీ వివాహం సందర్భంగా కొంతకాలం మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ విరామ సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నాడు. ఒక్క మ్యాచ్ మినహా అన్నింటిలోనూ ఘన విజయం దిశగా జట్టును నడిపించాడు. ఈ ప్రభావంతో క్రికెట్ అభిమానులు టీ 20 మ్యాచ్ల్లో రోహిత్ శర్మనే కెప్టెన్ కావాలంటూ ఓటింగ్ చేశారు. అయితే వన్డేల్లో మాత్రమే కోహ్లీకి కెప్టెన్గా అవకాశం ఇచ్చారు.
ప్రముఖ క్రీడల వెబ్సైట్ ఈఎస్పీఎన్ 2017 సంవత్సరానికి క్రికెట్ జట్లను ప్రకటించింది. గతేడాది గొప్పగా రాణించిన క్రికెటర్లతో మూడు ఫార్మాట్లకు టీమ్లను ఎంపిక చేసింది. ఆయా ఆటగాళ్లకు ఓట్లు వేయాలని వీక్షకులకు సూచించింది. ఈ ఓటింగ్ ఫలితంగా వన్డే జట్టుకు విరాట్ కోహ్లిని కెప్టెన్గా ఉండాలని వచ్చింది. టెస్టు టీమ్కు స్టీవ్ స్మిత్, టి20 జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
ఆశ్చర్యపడాల్సిన విషయమేమంటే టీ20 జట్టులో కోహ్లికి చోటు దక్కలేదు. టెస్టు జట్టులో కోహ్లి, చతేశ్వర్ పుజారా మాత్రమే ఉండగా, మన బౌలర్లు సైతం చోటు సంపాదించలేకపోయారు. ఫాస్ట్ బౌలర్ జాస్ప్రీత్ బుమ్రా.. వన్డే, టి20లోనూ చోటు దక్కించుకున్నాడు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లలో వన్డే టీమ్లోనే ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం విశేషం.
టెస్ట్ టీమ్: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్, పుజారా, విరాట్ కోహ్లి, షకీల్ అల్, ముషాఫిర్ రహీం, లియన్, రబడ, ఆండర్సన్, నీల్ వాగ్నర్
వన్డే జట్టు: కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, డీ కాక్, జోయ్ రూట్, బాబర్ అజామ్, హార్దిక్ పాండ్యా, స్టోక్స్, హసన్ అలీ, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
టి20 టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), లూయిస్, మెక్కల్లమ్, హాషిమ్ ఆమ్లా, బట్లర్, క్రిస్టియాన్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, హసన్ అలీ, జాస్ప్రిత్ బుమ్రా
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.