న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన మహిళా క్రికెట్ జట్టు: ఆసిస్‌పై సిరీస్ గెలుపు

By Srinivas

మెల్బోర్న్: భారత్ మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా పైన తొలిసారి ట్వంటీ 20 సిరీస్‌ను గెలుచుకున్నారు. వరుసగా రెండో మ్యాచులోను గెలిచారు. డక్ వర్తలూయిస్ పద్ధతిలో మహిళా క్రికెట్ టీం గెలిచింది. రెండో మ్యాచులో మహిళా క్రికెట్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్ దక్కించుకుంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ సీనియర్ జట్టు వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. టీ20 సిరీస్‌లో భాగంగా రెండు రోజుల క్రితం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. శుక్రవారం నాడు రెండో ట్వంటీ 20కి పురుషుల సీనియర్ జట్టు సిద్ధమవుతోంది.

ఇదే సమయంలో మహిళా జట్టు సిరీస్ గెలుచుకున్నారు. ఆస్ట్రేలియా జట్టుపైనే టీమిండియా మహిళల జట్టు రికార్డు విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండింటిలోనూ విజయం సాధించి, ఆసీస్ పైన క్లీన్ స్వీప్ విజయం సాధించింది.

T20Is: Indian women create history in Australia with series win

మహిళల రెండో వన్డే మెల్బోర్న్‌లో జరిగింది. ఈ సిరీస్ విజయంతో ఆసీస్ పైన భారత మహిళల జట్టు తొలిసారి టైటిల్ నెగ్గినట్లయింది. తొలి ట్వంటీ 20లో భారత్ మహిళా జట్టు ఆస్ట్రేలియా పైన 5 వికెట్ల తేడాతో గెలిచింది.

రెండో వన్డేకు వర్షం అడ్డంకి వచ్చింది. దీంతో డక్ వర్తలూయిస్ పద్ధతిలో భారత్ 10 ఓవర్లలో 66 పరుగులు చేయవలసి వచ్చింది. మరో అయిదు బంతులు ఉండగానే భారత్ మహిళా జట్టు గెలిచింది. కెప్టెన్ మిథాలి రాజ్ 37 (32 బంతుల్లో 6 ఫోర్లు)తో ఆకట్టుకుంది. ఆమె ఓపెనింగ్ పార్ట్‌నర్ స్మృతి మందన 24 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X