For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: అందుకే భారత్ భారీ స్కోర్లు చేయట్లేదు: గవాస్కర్

T20 World Cup: Sunil Gavaskar says India Cannot Score against Strong Teams With Good Bowlers
Sunil Gavaskar - Power Play ఓవర్లలో బ్యాటింగ్‌ విధానం మార్చాలి! || Oneindia Telugu

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా పూర్తిగా నిరాశపర్చింది. మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. అగ్రశ్రేణి జట్లయిన పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయాల తర్వాత పసికూనలైన అఫ్గనిస్థాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాపై భారత్ భారీ విజయాలు అందుకుంది.

అయినా కోహ్లీసేన సెమీస్‌కు చేరుకోలేకపోయింది. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి నమీబియాతో భారత జట్టు చివరి నామమాత్రపు మ్యాచ్‌ ఆడింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ పలు సలహాలు, సూచనలు చేశాడు.

మార్పులు చేయడం సరికాదు

మార్పులు చేయడం సరికాదు

పవర్‌ ప్లే ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్‌ విధానం మారాల్సి ఉందని సునీల్‌ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. 'జట్టులో చాలా మార్పులు చేయడం సరికాదు. ఎందుకంటే భారత్ తన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోలేదు. రెండు మ్యాచ్‌లలో బ్యాటర్లు ఆశించిన రీతిలో ఆడలేకపోయారు. టీమిండియా ప్రస్తుతం ఇలా మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించటానికి కారణం ఇదే అని నేను అనుకుంటున్నా.

ఈ విధానంలో మార్పు రావాలి' అని గవాస్కర్ అన్నారు. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లపై భారత్ బ్యాటింగ్ ఏమాత్రం బాగా లేదు. స్టార్ పేసర్లను ఎదుర్కోలేక భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు త్వరగా వికెట్లు కోల్పోయారు. అయితే పసికూనలపై మాత్రం చెలరేగి ఆడారు. నేపథ్యంలో సన్నీ వ్యాఖ్యలు చేశాడు.

ఆ విధానం మారాలి

ఆ విధానం మారాలి

'పవర్‌ ప్లేలో 30 యార్డ్‌ సర్కిల్ వెలుపల కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. గత కొన్ని ఐసీసీ టోర్నమెంట్‌లలో భారతదేశం దాని ప్రయోజనాన్ని పొందట్లేదు. అందుకే మంచి బౌలర్లు ఉన్న బలమైన జట్టుతో తలపడిన ప్రతిసారీ భారత్‌ భారీ స్కోర్లు చేయట్లేదు. కాబట్టి ఆ విధానం మారాల్సిన అవసరం ఉంది.

ఇక ఫీల్డింగ్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉండాలి. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసిన విధానం, పరుగులు కాపాడడం, క్యాచ్‌లు పట్టిన తీరు బాగుంది. బౌలింగ్‌ అటాక్‌ సాధారణంగా ఉన్నప్పటికీ మంచి ఫీల్డింగ్ ఉంటే ఫలితం మరోలా ఉంటుంది.భారత జట్టును పరిశీలిస్తే.. ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు మాత్రమే అత్యుత్తమ రీతిలో ఫీల్డింగ్‌ చేస్తున్నారు. ఇక్కడ కూడా భారత్ మెరుగవ్వాల్సి ఉంది' అని సునీల్‌ గవాస్కర్ తెలిపారు.

కొత్త ఆలోచనలు అవసరం

కొత్త ఆలోచనలు అవసరం

'భారత జట్టులో ఏదో ఒక విధమైన మార్పు ఉండాలని నేను భావిస్తున్నాను. కానీ భారీ స్థాయిలో మాత్రం ఉండకూడదు. కొత్త ముఖాలు, ఆలోచనలు అవసరం. అది జరుగుతుందని నేను భావిస్తున్నా. టీ20 ప్రపంచకప్‌ 2021లో రాణించలేదని భారీ మార్పులు ఉండకూడదు. అలాంటివి పనికిరావు. తదుపరి ప్రపంచకప్‌కు ముందు భారత్ కనీసం 20 టీ20లు ఆడబోతోంది.

కాబట్టి కొంతమంది ఆటగాళ్లకు ఇది గొప్ప అవకాశం. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ తప్పనిసరిగా ఆస్ట్రేలియా గురించి ఆలోచించాలి. ఆస్ట్రేలియాలో ఎలాంటి పిచ్‌లు ఉన్నాయి, బౌండరీల పరిమాణం లాంటి విషయాలను గుర్తుంచుకుని ఆటగాళ్లను ఎంచుకోవాలి' అని సన్నీ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, November 10, 2021, 8:29 [IST]
Other articles published on Nov 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+