For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్రోఫీలో కేరళని కెప్టెన్ రాయుడు కుమ్మేశాడు

Syed Mushtaq Ali Trophy: Hyderabad, Tamil Nadu get off to winning starts

హైదరాబాద్: సయ్యద్ ముస్థఖ్ అలీ ట్రోఫీలో భాగంగా సోమవారం హైదరాబాద్ జట్టు కేరళ జట్టుతో తలపడింది. ఈ పోటీలో తన అసమాన ప్రతిభను చూపించిన కెప్టెన్‌ అంబటి రాయుడు (52 నాటౌట్‌; 31 బంతుల్లో 3శ్రీ4, 2శ్రీ6) సత్తాచాటడంతో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టీ20 క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 10 పరుగుల ఆధిక్యంతో కేరళపై విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. అనంతరం కేరళ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ సచిన్‌ బేబి (79; 50 బంతుల్లో 7శ్రీ4, 2శ్రీ6) ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్‌ బౌలర్లలో సిరాజ్‌ (2/28), రవికిరణ్‌ (3/28) రాణించారు.

హైదరాబాద్‌: 168/5 (అక్షత్‌రెడ్డి 34, సందీప్‌ 25, రాయుడు 52 నాటౌట్‌, ఆశిష్‌రెడ్డి 21 నాటౌట్‌, సుమంత్‌ 18 నాటౌట్‌)
కేరళ: 158/7 (సచిన్‌ బేబి 79, సిరాజ్‌ 2/28, రవికిరణ్‌ 3/28)

ఆంధ్రాని అధిగమించిన తమిళనాడు
ఇదే టోర్నీలో ఆంధ్రాకు చుక్కెదురైంది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళనాడు 7 వికెట్ల తేడాతో ఆంధ్రాను ఓడించింది. తొలుత ఆంధ్రా 20 ఓవర్లలో 7 వికెట్లకు 119 పరుగులు చేసింది. బదులుగా తమిళనాడు 14.4 ఓవర్లలో 3 వికెట్లకు 122 పరుగులు సాధించింది.
తమిళనాడు: 122/3 (దినేశ్‌ కార్తీక్‌ 57)
ఆంధ్ర: 119/7 (రిక్కీ భుయ్‌ 25)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 9:23 [IST]
Other articles published on Jan 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+