మూడో టీ20లో అరుదైన రికార్డు
అయితే, సిడ్నీ వేదికగా జరిగిన మూడో టీ20లో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన కృనాల్ పాండ్యా 36 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ గడ్డపై టీ20ల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి స్పిన్నర్గా కృనాల్ పాండ్యా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డుని సైతం అందుకున్నాడు.
విమర్శలకు బంతితోనే సమాధానం
తొలి టీ20లో తనపై వచ్చిన విమర్శలకు బంతితోనే సమాధానం చెప్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ పేరిట ఉండేది. ఈ ఏడాది హోబార్ట్లో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో మాక్స్వెల్ మూడు వికెట్లు తీసి 10 పరుగులు ఇచ్చాడు. ఆసీస్ గడ్డపై ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా, ఇప్పుడు పాండ్యా ఆ రికార్డును అధిగమించాడు.

6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్
ఆదివారం జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్ (33), ఫించ్ (28), క్యారీ (27) రాణించగా చివర్లో స్టొయినిస్ (25 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది.

డిసెంబర్ 6 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్
ఓపెనర్ శిఖర్ ధావన్ (22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), రోహిత్ శర్మ (16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 23), దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్తో 22 నాటౌట్) రాణించారు. ఈ సిరిస్లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది. ఇక, భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications













