For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు టీ20ల సిరిస్ కోసం సఫారీ పర్యటనకు సురేశ్ రైనా

By Nageshwara Rao
Suresh Raina to south africa for t20 series on sunday

హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి సురేశ్ రైనా పునరాగమనం చేయనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన తుది జట్టులో సురేశ్ రైనా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా ఆదివారం దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లనున్నాడు.

భారత తరుపున చివరిసారిగా రైనా ఫిబ్రవరి 1, 2017న ఇంగ్లాండ్‌తో జరిగిన ఆడాడు. ఆ తర్వాత రైనాను ఫిట్‌నెస్ సమస్యలు వేధించడంతో పాటు జట్టులో ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యో-యో టెస్టు పాసవ్వకపోవడంతో ఏడాదిపాటు జట్టుకు దూరమయ్యాడు.

గతేడాది చివర్లో యో-యో టెస్టు పాసైన రైనా దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20ల సిరిస్‌లో భారత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆరు వన్డేల సిరిస్ అనంతరం ఫిబ్రవరి 18 నుంచి భారత్-దక్షిణాప్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా ఆదివారం దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లనున్నాడు.

Story first published: Saturday, February 10, 2018, 16:49 [IST]
Other articles published on Feb 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+