
హైదరాబాద్: సురేశ్ రైనా మళ్లీ భారత జట్టు తరపున ఆడనున్నాడు. సంవత్సర కాలం తర్వాత మూడు టీ 20 మ్యాచ్ల సిరీస్కు సెలక్టర్లు రైనాను ఎంచుకున్నారు. దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత జట్టులో రైనాకు ఏ స్థానం దక్కునుందో..
సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు.
2007 ఫిబ్రవరి 1న ఇంగ్లాండ్తో జరిగిన టీ 20 మ్యాచ్లో రైనా భారత జట్టు తరపున ఆడాడు. వన్డే మ్యాచ్లో అయితే అక్టోబరు 2015 తర్వాత కనిపించనేలేదు.
జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ కొనసాగుతుండటంలో ఎలాంటి మార్పూ లేదు. దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరి 18, 21, 24 తేదీల్లో జరగనున్న టీ 20 మ్యాచ్లు జోహన్నస్బర్గ్, సెంచూరియో, కేప్ టౌన్లు వేదిక కానున్నాయి.
టీ 20ల్లో ఆడనున్న భారత జట్టు:
Virat Kohli (captain), Rohit Sharma (vice-captain), Shikhar Dhawan, KL Rahul, Suresh Raina, MS Dhoni, Dinesh Karthik, Hardik Pandya, Manish Pandey, Axar Patel, Yuzvendra Chahal, Kuldeep Yadav, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Shardul Thakur, Jaydev Unadkat.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.