హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మొదలుపెట్టిన బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్ బాగా పాపులర్ అయింది. ఐపీఎల్ పదో సీజన్ సందర్భంగా రవీంద్ర జడేజా తన అభిమానులకు బ్రేక్ ద బియర్డ్ అనే ఛాలెంజ్ని విసిరాడు.
ఈ ఛాలెంజ్ని రోహిత్శర్మ, శిఖర్ధావన్లాంటి క్రికెటర్లు స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఛాలెంజ్ని మరో క్రికెటర్ స్వీకరించాడు. అయితే దానికి కాస్త కూతురు సెంటిమెంట్ను జోడించాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా.
గడ్డంతో తన కూతురు గ్రేసియా ఇబ్బంది పడుతున్నదని, ఆమె కోసం బ్రేక్ ద బియర్డ్ చాలెంజ్ను స్వీకరిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్టు చేశాడు.
ఐపీఎల్ జరుగుతున్న సమయంలో రోహిత్శర్మ, శిఖర్ధావన్లాంటి క్రికెటర్లు జడేజా బ్రేక్ ద బియర్డ్ చాలెంజ్ను స్వీకరించారు. గత వారంలో జహీర్ ఖాన్ కూడా గడ్డం తీసి కొత్త లుక్లో కనిపించాడు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తన గర్ల్ఫ్రెండ్ అనుష్క శర్మ కోరిక మేరకు ఈ ఛాలెంజ్కు దూరంగా ఉన్నాడు.