ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సురేష్ రైనా 3,500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గురువారం నాడు కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈడెన్ గార్డెన్లో మ్యాచ్ జరిగింది. రైనా ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ ఆడాడు.
ఐపీఎల్లో రైనా ఓ సెంచరీ, 24 అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక స్కోర్ ఇతనే చేశాడు. రైనా తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. సురేష్ రైనా మొదటి నుండి చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడుతున్నాడు.
టాప్-5 వీరే...
1. సురేష్ రైనా - చెన్నై సూపర్ కింగ్స్ - చేసిన పరుగులు 3,502, సెంచరీలు ఒకటి - అర్ధ సెంచరీలు 24 - హైస్కోర్ 100* - ఆడిన మ్యాచ్లు 123
2. రోహిత్ శర్మ - ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్ - చేసిన పరుగులు 3,147 - సెంచరీలు ఒకటి - అర్ధ సెంచరీలు 23 - హైస్కోర్ 109* - ఆడిన మ్యాచ్లు 119
3. గౌతమ్ గంభీర్ - ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్కతా నైట్ రైడర్స్ - చేసిన పరుగులు 2,996 - అర్ధ సెంచరీలు 26 - హైస్కోర్ 93 - ఆడిన మ్యాచ్లు 111
4. క్రిస్ గేల్ - కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చేసిన పరుగులు 2,927 - సెంచరీలు 4, అర్ధ సెంచరీలు 18 - హైస్కోర్ 175* - ఆడిన మ్యాచ్లు 74
5. విరాట్ కోహ్లీ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చేసిన పరుగులు 2,853 - అర్ధ సెంచరీలు 18 - హైస్కోర్ 99 - ఆడిన మ్యాచ్లు 114