
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా యో-యో టెస్టులో పాసయ్యాడు. ఈ విషయాన్ని సురేశ్ రైనా తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే యో-యో టెస్టులో పాస్ తప్పనిసరి అంటూ బీసీసీఐ సెలక్టర్లు కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
గత కొన్నాళ్లుగా యో-యో టెస్టులో విఫలమవ్వడంతో సురేశ్ రైనా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో గురువారం నిర్వహించిన యో-యో టెస్టులో 31 ఏళ్ల సురేశ్ రైనా పాసయ్యాడు.
నేషనల్ క్రికెట్ అకాడమీలోని కోచ్లు, ట్రైనర్లతో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా రైనా ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. 'ఎన్నో రోజుల సాధన తర్వాత ఎన్సీఏలో నిర్వహించిన యో-యో టెస్టులో పాసయ్యాను. ట్రైనర్లు, కోచ్లు, నిర్వాహకులు నుంచి ఎంతో మద్దతు లభించింది. ఇక్కడి శిక్షణ ఎంతో ప్రోత్సాహం, స్ఫూర్తిని కలిగిస్తుంది. నా లక్ష్యాలను గుర్తు చేస్తూ నాలో దాగి ఉన్న ప్రతిభను బయటికి తీస్తుంది' అని రైనా ట్వీట్ చేశాడు.
యో-యో టెస్టులో సురేశ్ రైనా పాసవ్వడంతో ఇకపై సెలక్టర్లకు అందుబాటులోకి వచ్చినట్లే. 16.1 అర్హత మార్కుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆటగాళ్లకు యో-యో పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇటీవలే టీమిండియా వెటరన్ క్రికెటర్
యువరాజ్ సింగ్ ఈ టెస్టులో 16.3 పాయింట్లతో పాసైన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.