
18 బంతుల్లో 12 పరుగులు చేసిన రైనా
ఈ మ్యాచ్లో 32 ఏళ్ల సురేశ్ రైనా 18 బంతుల్లో 12 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. దీంతో టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం సురేశ్ రైనా 300 మ్యాచుల్లో 8001 పరుగులు చేశాడు. మొత్తంగా టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల్ని సాధించిన ఆరో క్రికెటర్గా రైనా నిలిచాడు.

అగ్రస్థానంలో క్రిస్ గేల్
ఈ జాబితాలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రిస్ గేల్ 269 మ్యాచుల్లోనే 12298 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెండన్ మెకల్లమ్ (370 మ్యాచుల్లో 9922 పరుగులు), కీరన్ పొలార్డ్ (8838), షోయబ్ మాలిక్ (8603), డేవిడ్ వార్నర్ (8111)లు ఉన్నారు.

ధోని తర్వాత సురేశ్ రైనానే
ఇక, బారత తరుపున ఈ జాబితాలో రైనా తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 251 మ్యాచుల్లో 7833 పరుగులు చేశాడు. దీంతో పాటు ధోనీ (301) తర్వాత మూడొందల టీ20 మ్యాచ్లు ఆడిన రెండో భారత క్రికెటర్గా రైనా అరుదైన గుర్తింపు పొందాడు. మూడోస్థానంలో రోహిత్ శర్మ (299) ఉన్నాడు.


Click it and Unblock the Notifications













