
టీమిండియా సెలెక్టర్లు ప్రపంచకప్లో ఆడే 15 మంది సభ్యులతో కూడిన జట్టును మరికొద్ది సేపట్లో ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ప్రపంచకప్ జట్లను ప్రకటించాయి. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రపంచకప్కి వెళ్లే తన కలల జట్టును ప్రకటించారు.

15 మంది సభ్యులతో కూడిన జట్టులో.. ఇప్పటివరకు టీమిండియా తరపున ఆడని చెన్నై సూపర్ కింగ్స్ పేస్ బౌలర్ దీపక్ చాహర్కు చోటు కల్పించాడు. ఇక ఆల్ రౌండర్ జాబితాలో జడేజాను కాదని విజయ్ శంకర్ను ఎంచుకున్నాడు. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ స్థానానికి ముందు నుంచి రేసులో ఉన్న రిషబ్ పంత్కు ఛాన్స్ ఇచ్చాడు. నాలుగో స్థానంకు అంబటి రాయుడుకు కాకుండా.. కేఎల్ రాహుల్కు ఓటేశాడు. ఇక అందరూ అనుకున్నట్టుగానే మిగతా వారు కూడా గవాస్కర్ జట్టులో ఉన్నారు.

రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, విజయ్ శంకర్, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్.