
వరల్డ్ కప్లో దినేశ్ కార్తీక్
వన్డేల్లో అతడి స్థానంలో సెలక్టర్లు రిషబ్ పంత్కు అవకాశమిచ్చారు. దీంతో వరల్డ్ కప్లో దినేశ్ కార్తీక్ ఆడటం అనుమానంగానే మారింది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్ కోసం ప్రకటించిన తన జట్టులో రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తీకకే చోటిచ్చాడు మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. దినేశ్ కార్తీక్ను మూడో ఓపెనర్గా ఎంపిక చేసిన గావస్కర్.. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రహానేలకు మాత్రం తన జట్టులో చోటివ్వలేదు.

మొత్తం 13 మందితో కూడిన జట్టు
మొత్తం 13 మందితో కూడిన జట్టుని గవాస్కర్ ఎంపిక చేయడం విశేషం. గవాస్కర్ ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ... మిడిలార్డర్లో దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యాలకు చోటు కల్పించగా... బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చహల్, బూమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్లకు చోటు కల్పించాడు.

14 ఆటగాడిగా విజయ్ శంకర్
ఇక, 14 ఆటగాడిగా విజయ్ శంకర్ ఉండవచ్చనే అభిప్రాయాన్ని గవాస్కర్ వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్లో వాతావరణ పరిస్థితుల్ని బట్టి తుది జట్టులో ఇద్దరు ఆల్ రౌండర్లు ఉండాలని కోరుకంటే అప్పుడు విజయ్ శంకర్కు కూడా అవకాశం ఇవ్వొచ్చని గవాస్కర్ తన అభిప్రాయన్ని వెల్లడించాడు.

15వ ఆటగాడిగా ఖలీల్ అహ్మద్ లేదా ఉమేశ్ యాదవ్
అయితే 15వ ఆటగాడిగా ఎవరిని తీసుకోవాలనేదానిపై తాను కచ్చితంగా చెప్పలేనని గవాస్కర్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో పేసర్ ఖలీల్ అహ్మద్ నిరాశపర్చడంతో మరో పేసర్గా ఉమేశ్ యాదవ్ ఒక మంచి ఆప్షన్గా ఎంపిక చేస్తే బాగుంటుందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

వరల్డ్ కప్ కోసం గవాస్కర్ ఎంపిక చేసిన జట్టిదే:
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చహల్, బూమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
14వ ఆటగాడిగా విజయ్ శంకర్
15వ ఆటగాడిగా ఖలీల్ అహ్మద్ లేదా ఉమేశ్ యాదవ్


Click it and Unblock the Notifications













