For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ రెఫరీలపై గవాస్కర్ మండిపాటు

By Staff
Sunil Gavaskar
ముంబయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మ్యాచ్ రెఫరీలు ఆసియా ఆటగాళ్ల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన భారత బౌలర్ జహీర్ ఖాన్ కు విధించిన శిక్షపై ఆయన మండిపడ్డారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మాథ్యూ హెడెన్ పట్ల వ్యవహరించిన తీరుకు జహీర్ ఖాన్ మ్యాచ్ ఫీజులో ఇంగ్లాండుకు చెందిన మ్యాచ్ రెఫరీ క్రిస్ బ్రాడ్ 80 శాతం కోత విధించారు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో హెడెన్ అవుటయిన తర్వాత జహీర్ ఖాన్ వ్యవహరించిన తీరుపై ఆ కోత విధించారు.

హెడెన్ పట్ల జహీర్ ఖాన్ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించి ఉంటే శిక్షార్హుడేనని, అయితే ఎల్లవేళలా భారత్ లేదా భారత ఉపఖండం ఆటగాళ్లకే శిక్షలు విధిస్తున్నారని, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అటువంటిదేమీ ఉండదని ఆయన బుధవారంనాడు అన్నారు. రెండో టెస్టులో చాలా సంఘటనలు జరిగాయని, రెండో ఇన్నింగ్సులో వీరేంద్ర సెహ్వాగ్ ను నాటవుట్ గా ప్రకటించారని, అయితే అంతటితో అది ముగిసిపోలేదని, ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఎక్స్ ట్రా కవర్ నుంచి అంపైర్ వద్దకు వచ్చి మరీ మరీ అడగాడని ఆయన వివరించారు. అదే పని భారత ఆటగాడు చేసి ఉంటే సహించి ఉండేవారు కాదని, జరిమానా విధించి ఉండేవారని, ఈ విషయంలో ఐసిసి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మనుగా గవాస్కర్ మేలో తప్పుకున్న విషయం తెలిసిందే. జనవరిలో భారత ఆటగాళ్ల పట్ల ఐసిసి మ్యాచ్ రెఫరీ మైక్ ప్రొక్టర్ వివక్ష ప్రదర్శించారని ఆయన గుర్తు చేశారు.
Story first published: Wednesday, October 22, 2008, 16:31 [IST]
Other articles published on Oct 22, 2008
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+