
వన్డే గేమ్ ఎలా ఉందంటే
"ప్రస్తుతం వన్డే గేమ్ ఎలా ఉందంటే... టీ20లకు కాస్త కొనసాగింపు మాత్రమే. దీంతో టీ20 క్రికెట్ ప్రిపేర్ అయ్యేందుకు మంచి మార్గం. ప్రపంచంలో అత్యుత్తమ టోర్నీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒకటి. రోజురోజుకు నేను సిద్ధంగానే ఉన్నా. ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడేందుకు ఉన్న ప్రతి మార్గాన్ని చక్కగా వినియోగించుకోవాలని చూస్తున్నా" అని స్మిత్ అన్నాడు.

బాల్ టాంపరింగ్ ఘటనలో దోషులుగా
బాల్ టాంపరింగ్ ఘటనలో దోషులుగా తేలిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించడంతో ఐపీఎల్ 2018 సీజన్కు వీరిద్దరూ దూరమైన సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఐపీఎల్ సీజన్కు ముందే వీరిపై నిషేధం తొలగిపోనుండటంతో ప్రాంఛైజీలు వీరిని అట్టిపెట్టుకున్నాయి.

వచ్చే ఐపీఎల్ సీజన్లో బరిలోకి స్మిత్, వార్నర్
దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్లో వీరిద్దరూ ఆయా జట్ల తరుపున బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు.

వేలంలో 60 మందిని కోనుగోలు చేసిన ప్రాంఛైజీలు
ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు. 70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడగా 60 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 విదేశీ ఆటగాళ్లున్నారు. వీళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 106.8 కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












