ముంబై: అర్ధాంతరకంగా క్రికెట్ కేరీర్కు వీడ్కోలు పలికిన మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడిపై టీమిండియా మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమౌతోంది. పలువురు మాజీ క్రికెటర్లు అంబటి రాయుడికి అండగా ఉంటున్నారు. అంబటిపై మొదటి నుంచీ చిన్న చూపు చూస్తూనే వస్తోందని టీమిండియా మాజీ క్రికెటర్, సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ సందీప్ పాటిల్ వ్యాఖ్యానించారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న అంబటి రాయుడు ఇలా అర్ధాంతరంగా తన క్రికెట్ కేరీర్కు ముగింపు పలకడం తనను ఆవేదనకు గురి చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
శ్రీలంకతో మ్యాచ్లో ధోనీ ఆడేది డౌటే! వేలి గాయం తీవ్రం?
తానే గనక ప్రపంచకప్ ఆడే టీమిండియాకు కేప్టెన్గా ఉండి ఉంటే- జట్టులో అంబటి రాయుడికి చోటు కల్పించడానికి సెలెక్షన్ కమిటీతో పోరాడేవాడినని అన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తమిళనాడుకు చెందిన ఆల్రౌండర్ విజయ్ శంకర్ గొప్పగా రాణిస్తాడనే ఉద్దేశంతోనే అంబటి రాయుడిని పక్కన పెట్టారని గుర్తు చేశారు. ఈ టోర్నమెంట్లో విజయ్ శంకర్ గాయపడ్డ తరువాత, అతని స్థానాన్ని అంబటితోనే భర్తీ చేసి ఉండాల్సిందని అన్నారు. అంబటికి బదులుగా కనీసం స్టాండ్బైలో కూడా లేని మయాంక్ అగర్వాల్ను తీసుకోవడంలో అర్థం లేదని చెప్పారు.
మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆటగాడే అయినప్పటికీ.. ప్రపంచకప్ టోర్నమెంట్లో ప్రత్యర్థి జట్టు నుంచి ఎదురయ్యే దాడిని, ఒత్తిడిని ఎదుర్కొనలేడని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. 50కి పైగా వన్డే మ్యాచ్లను ఆడిన అనుభవం ఉన్న అంబటిని ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం ఎంపిక చేసి ఉంటే, చాలా బాగుండేదని అన్నారు. ఏదేమైనప్పటికీ.. అంబటి రాయుడు తన కేరీర్ను వదులుకోవడం బాధ కలిగించిందని, అతని తదుపరి క్రీడా జీవితం ఆనందంగా గడపాలని తాను కోరుకుంటున్నట్లు సందీప్ పాటిల్ తెలిపారు.