
420 పరుగులు చేసిన కోహ్లీ
1 - ప్రస్తుత సిరిస్లో ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 420 పరుగులు చేశాడు. వెస్టిండిస్ జట్టుపై ఓ భారత ఆటగాడు చేసిన అత్యధిక పరుగులివే కావడం విశేషం.
1 - ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రోహిత్ శర్మ(162) మొట్టమొదటిసారి సెంచరీ సాధించాడు.
1 - వన్డేల్లో ఓపెనర్ రోహిత్ శర్మ 150+పైగా స్కోరు నమోదు చేయడం ఇది ఏడోసారి. అంతర్జాతీయ క్రికెట్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 5 సార్లు ఈ ఘనత సాధించారు. తాజా సెంచరీతో రోహిత్ శర్మ తన రికార్డును మరింతగా మెరుగుపరుచుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సనత్ జయసూర్య 4 సార్లు 150కిపైగా పరుగుల సాధించి ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ధావన్-రోహిత్ల జోడీ అరుదైన రికార్డు
2 - ఓపెనర్లుగా శిఖర్ ధావన్-రోహిత్ శర్మల జోడీ సచిన్-సెహ్వాగ్ల 3919 పరుగుల రికార్డుని అధిగమించారు. భారత ఓపెనర్ల జోడీగా సచిన్-గంగూలీ జోడీ 6609 పరుగులు నమోదు చేశారు.
2 - బ్రబౌర్న్ స్టేడియంలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో మొత్తం 4 సిక్సులు ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ సిక్సుల సంఖ్య 198కి చేరుకుంది. తద్వారా వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్(195) రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
2 - ఓపెనర్గా రోహిత్ శర్మ తన కెరీర్లో 19వ సెంచరీని నమోదు చేశాడు. తద్వారా ఈ జాబితాలో రెండో ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్గా అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ కంటే సచిన్ టెండూల్కర్(45) ముందున్నాడు.

రోహిత్ శర్మ అరుదైన ఘనత
2 - ఒక సిరిస్లో 150కి పైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ కంటే ముందు హామిల్టన్ మసకద్జా(2009లో కెన్యాపై) ఈ ఘనత సాధించాడు.
2 - ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సాధించిన 162 పరుగులు వెస్టిండిస్ జట్టుపై ఓ భారత బ్యాట్స్మన్ నమోదు చేసిన అత్యధిక పరుగులు కావడం విశేషం.
4 - వన్డేల్లో రోహిత్ శర్మ 21 సెంచరీల మైలురాయిని అందుకునేందుకు 186 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. హషీం ఆమ్లా, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న నాలుగో క్రికెటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ (49), కోహ్లీ (38), గంగూలీ (22) తర్వాత స్థానంలో ఉన్నాడు.

ఓ ద్వైపాక్షిక సిరిస్లో రోహిత్ శర్మ ఇదే మొదటిసారి
5 - ఓ ద్వైపాక్షిక సిరిస్లో రోహిత్ శర్మ మొట్టమొదటిసారి 300కు పైగా పరుగులు సాధించాడు. కేవలం కోహ్లీ మాత్రమే ఓ సిరిస్లో ఏడు సార్లు 300కుపైగా పరుగులు సాధించాడు.
13 - వన్డేల్లో 375కి పైగా పరుగులు చేయడం భారత్కు ఇది 13వ సారి కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో ఓ జట్టుకు ఇదే అత్యధికసార్లు కావడం విశేషం.
16 - ఈ మ్యాచ్లో కోహ్లీ చేసిన 16 పరుగులే ఈ ఏడాది వన్డేల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications












