న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గణాంకాలు: తొలి వన్డేలో చరిత్ర సృష్టించిన రోహిత్, నమోదైన రికార్డులివే

Stats: Rohit Sharma creates history in the first ODI vs WI

హైదరాబాద్: టెస్టు సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా వన్డేల్లోనూ భారీ విజయంతో శుభారంభం చేసింది. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండిస్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.

81 పరుగులు: తొలి వన్డేలో చెత్త రికార్డుని నమోదు చేసిన షమీ81 పరుగులు: తొలి వన్డేలో చెత్త రికార్డుని నమోదు చేసిన షమీ

విండిస్ బ్యాట్స్‌మన్లలో షిమ్రాన్‌ హెట్‌మెయిర్ (106) కెరీర్‌లో మూడో సెంచరీ సాధించగా, కీరన్‌ పావెల్‌ (51) హాఫ్ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో చాహల్‌కు మూడు, షమీ, జడేజాలకు రెండు, ఖలీల్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ తీశాడు. అనంతరం లక్ష్యం పెద్దదైనా భారత్‌ ఏమాత్రం ఇబ్బంది పడలేదు.

కెప్టెన్‌ కోహ్లీ (140), ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (152 నాటౌట్‌) సెంచరీలతో చెలరేగడంతో 47 బంతులుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 246 పరుగులు జోడించడం విశేషం. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే బుధవారం విశాఖ వేదికగా జరగనుంది.

1
44266

ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరిచింది. తొలి వన్డేలో నమోదైన అనేక రికార్డులను ఒక్కసారి పరిశీలిద్దాం.....

రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ

రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ

* విండీస్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు (152) నమోదు చేసిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ నిలిచాడు. సెహ్వాగ్‌ (219) పరుగులతో ముందున్నాడు.

* 20 - వన్డేల్లో రోహిత్‌ శర్మ సెంచరీల సంఖ్య. భారత్‌ తరఫున సచిన్‌ (49), కోహ్లీ (36), గంగూలీ (22) తర్వాత అతను నాలుగో స్థానంలో ఉన్నాడు.

* 6 - రోహిత్‌ వన్డేల్లో ఆరు సార్లు 150కి పైగా స్కోర్లు సాధించాడు. గతంలో సచిన్, వార్నర్‌ ఐదేసిసార్లు ఈ ఘనత సాధించారు. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి రోహిత్‌ వరుసగా 9 వన్డే సిరీస్‌లలో సెంచరీని నమోదు చేశాడు.

 సౌరవ్‌ గంగూలీ రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

సౌరవ్‌ గంగూలీ రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

* 3 - వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీ (190)ను వెనక్కి నెట్టి రోహిత్‌ శర్మ (194) మూడో స్థానానికి చేరాడు. ధోని (217), సచిన్‌ (195) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

* 20 - రోహిత్‌ శర్మ వన్డే సెంచరీల సంఖ్య. అతడికిది 183వ ఇన్నింగ్స్‌. హషీమ్‌ ఆమ్లా (108), కోహ్లీ (133), డివిలియర్స్‌ (175)ల తర్వాత వేగంగా ఈ మార్కును అందుకున్నాడు.

* రోహిత్‌కు ఇది వన్డేల్లో 20వ సెంచరీ. వెస్టిండీస్‌పై అతనికిదే తొలి సెంచరీ కావడం విశేషం.

కోహ్లీ, రోహిత్‌ శర్మ చేసిన సెంచరీల భాగస్వామ్యాల సంఖ్య

కోహ్లీ, రోహిత్‌ శర్మ చేసిన సెంచరీల భాగస్వామ్యాల సంఖ్య

* 5 - వన్డేల్లో కోహ్లీ, రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య. మరే జోడీ మూడుకు మించి డబుల్ సెంచరీలు సాధించలేదు.

* 246 - తొలి వన్డేలో కోహ్లీ, రోహిత్‌ల భాగస్వామ్యం. భారత్‌ తరఫున వన్డే ఛేదనల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమం. 2009లో కోహ్లీ, గంభీర్‌ 224 పరుగులతో నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది.

* ఛేదనలో రెండో వికెట్‌కు అత్యధిక పరుగుల (246) భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తొలి భారత జోడీ రోహిత్‌-కోహ్లీ నిలిచింది. ఓవరాల్‌గా ఛేదనలో ఇది రెండో అత్యధికం. ఈ జాబితాలో వాట్సన్‌, పాంటింగ్‌ (252) ముందున్నారు.

కెప్టెన్‌‌గా కోహ్లీ సాధించిన సెంచరీలు

కెప్టెన్‌‌గా కోహ్లీ సాధించిన సెంచరీలు

* 14 - వన్డేల్లో కెప్టెన్‌గా 50 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ సాధించిన సెంచరీలు. పాంటింగ్‌ (22) తర్వాతి స్థానం అతడిదే. అతను 220 ఇన్నింగ్స్‌లకు అన్ని సెంచరీలు చేశాడు. ఛేదనలో అతడికిది 22వ సెంచరీ కాగా స్వదేశంలో 15వది.

* 300కి పైగా పరుగుల ఛేదనలో అత్యధిక సెంచరీలు (8) చేసిన తొలి ఆటగాడు కోహ్లీ. అలాగే వరుసగా మూడు కేలండర్‌ ఇయర్స్‌ (20016-18)లో 2000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగానూ సచిన్‌, హేడెన్‌, రూట్‌ సరసన నిలిచాడు.

* వన్డేల్లో అత్యధిక సెంచరీల (15) భాగస్వామ్యాలు ఏర్పరచిన ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్‌ శర్మ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో సచిన్‌, గంగూలీ (26సార్లు) ఉన్నారు.

సచిన్‌ తర్వాత కోహ్లీనే

సచిన్‌ తర్వాత కోహ్లీనే

* 36 - వన్డేల్లో కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య. ఈ జాబితాలో సచిన్‌ (49) మాత్రమే అతనికంటే ముందున్నాడు. టెస్టుల్లో సాధించిన 24తో కలిపి మొత్తం శతకాల సంఖ్య 60కి చేరుకుంది.

* వెస్టిండీస్‌తో వన్డేల్లో అత్యధిక పరుగులిచ్చిన (81) భారత బౌలర్‌ షమి. ఈ జాబితాలో జడేజా (80)ను షమి అధిగమించాడు.

* భారత్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 224వ క్రికెటర్‌గా రిషభ్‌ పంత్‌ గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన వన్డేలో మాజీ కెప్టెన్‌ ధోని చేతుల మీదుగా రిషభ్‌ పంత్‌ క్యాప్‌ను అందుకున్నాడు.

Story first published: Monday, October 22, 2018, 12:47 [IST]
Other articles published on Oct 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X