
చేధనలో అత్యధిక పరుగుల రికార్డు
ఈ మ్యాచ్లో దేవదత్ పాడిక్కల్(122 నాటౌట్) సాధించిన సెంచరీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ చరిత్రలోనే చేధనలో అత్యధిక పరుగులు కావడం విశేషం. ఈ క్రమంలో 2017-18 ఎడిషన్లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్(116) హిమాచల్ ప్రదేశ్పై నెలకొల్పిన రికార్డు ఇప్పుడు బద్దలైంది.

టీ20 చేధనలో సైతం
టీ20 చేధనలో ఓ కర్ణాటక బ్యాట్స్మన్ నెలకొల్పిన అత్యధిక పరుగులు కూడా ఇవే కావడం విశేషం. 2011 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున పాల్ వాల్తాటి(120 నాటౌట్) నెలకొల్పిన రికార్డు కూడా కనుమరుగైంది.

184 పరుగులు చేసిన ఆంధ్ర
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక మరో ఏడు బంతులు మిగిలిండగానే లక్ష్యాన్ని చేధించింది. రెండో ఓవర్కే కర్ణాటక జట్టు ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన దేవదత్ పాడిక్కల్ చేలరేగాడు.

24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
4.3 ఓవర్లకు కృష్ణప్ప గౌతమ్తో కలిసి మూడో వికెట్కు 63 పరుగులు జోడించిన దేవదత్ పాడిక్కల్... కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన దేవదత్ హాఫ్ సెంచరీని సెంచరీగా మలచేందుకు మరో 23 బంతులే తీసుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications
