వరుసగా పది సిరిస్ విజయాలను సాధించిన భారత్
10 - స్వదేశంలో భారత్ వరుసగా సాధించిన సిరీస్ విజయాల సంఖ్య. దీంతో సొంతగడ్డపై అత్యధిక వరుస సిరీస్లు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా (రెండుసార్లు 10 చొప్పున; 1994-2000 మధ్య; 2004-08 వరకు) పేరిట ఉన్న రికార్డును భారత్ సమం చేసింది. 2013 నవంబరులో వెస్టిండీస్పై 2-0 విజయంతో సొంతగడ్డపై భారత్ జైత్రయాత్ర మొదలైంది.
10 - భారత గడ్డపై టెస్టు మ్యాచ్లో 10 వికెట్లు తీసిన మూడో భారత పేసర్ ఉమేశ్ యాదవ్. గతంలో జవగళ్ శ్రీనాథ్ (13 కోల్కతాలో పాకిస్తాన్పై 1999లో), కపిల్దేవ్ (రెండుసార్లు; 11 చెన్నైలో పాక్పై 1980లో; 10 అహ్మదాబాద్లో వెస్టిండీస్పై 1983లో) మాత్రమే ఈ ఘనత సాధించారు.
18 - ఈ వయసులో భారత్ విజయం సాధించే పరుగులు చేసిన అతి పిన్నవయస్కుడిగా పృథ్వీ షా నిలిచాడు.
అరంగేట్రం చేసిన భారత క్రికెటర్కే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు
3 - విండిస్తో సొంతగడ్డపై జరిగిన చివరి మూడు టెస్టు సిరీస్లలో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్కే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కాయి. 2011లో అశ్విన్, 2013లో రోహిత్ ఈ ఘనత సాధించారు. ఈ సిరిస్తో అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ పృథ్వీ షాకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
4 - అరంగేట్రం చేసిన సిరీస్లోనే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు పొందిన పదో క్రికెటర్గా, భారత్ నుంచి నాలుగో క్రికెటర్గా పృథ్వీ షా అరుదైన గుర్తింపు పొందాడు.
23 టెస్టుల్లో విజయం సాధించిన భారత్
23 - భారత జట్టు 2013 నవంబరు నుంచి ఇప్పటిదాకా ఆడిన 29 టెస్టుల్లో సాధించిన విజయాలు. ఒక్క మ్యాచ్లోనే ఓడింది. 5 టెస్టులు మాత్రమే డ్రా అయ్యాయి.
3 - భారత్ సొంతగడ్డపై చివరగా ఆడిన మూడు టెస్టుల్లోనూ మూడు రోజుల్లోపే విజయం సాధించింది. ఈ సిరీస్ ముందు జరిగిన ఆఫ్ఘనిస్థాన్ను రెండే రోజుల్లో ఓడించింది.
7 - వెస్టిండీస్పై వరుసగా భారత్ సాధించిన సిరీస్ విజయాలు. 2002-03 నుంచి సొంతగడ్డపై ఆ జట్టుతో ఆడిన ఏడు సిరీస్ల్లోనూ టీమ్ఇండియాదే విజయం. మొత్తం 21 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా భారత్ ఓడలేదు.
7 - టెస్టుల్లో వెస్టిండిస్ ఓపెనర్లు డకౌట్ అయిన సందర్భాలు.
రాహుల్ ద్రవిడ్ సరసన రిషబ్ పంత్
2- మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తర్వాత (92, 93 శ్రీలంకపై 1997లో) వరుస ఇన్నింగ్స్లలో 90ల్లో ఔటైన రెండో భారత క్రికెటర్గా రిషభ్ పంత్ నిలిచాడు.
3 - రవిశాస్త్రి (న్యూజిలాండ్పై వెల్లింగ్టన్లో 1981లో), కపిల్దేవ్ (ఆస్ట్రేలియాపై అడిలైడ్లో 1985లో) తర్వాత ఓ టెస్టులో నాలుగు బంతుల తేడాలో మూడు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా ఉమేశ్ యాదవ్ నిలిచాడు.
4222* - ఆసియా ఖండం తరుపున కెప్టెన్గా విరాట్ కోహ్లీ చేసిన పరుగులు. ఈ జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ రికార్డుని కోహ్లీ అధిగమించాడు.