కాన్ బెర్రా వన్డే: భారత్ పై శ్రీలంక విజయం

అంతకు ముందు టీం ఇండియా యువ ఆటగాళ్లు రోహిత్ శర్మ, గౌతం గంభీర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాణించడంతో భారత్ నిర్ణీత 29 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (70, 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించడంతో భారత్ ఈ మ్యాచ్లో ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచింది. వర్షం కారణంగా మొదట మ్యాచ్ను 29 ఓవర్లకు కుదించారు. ఓపెనర్లు సచిన్ టెండూల్కర్ (32), వీరేంద్ర సెహ్వాగ్ (14) తొలి వికెట్కు 49 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. వరుస ఓవర్లలో వీరిద్దరూ వెనుదిరిగినప్పటికీ అనంతరం వచ్చిన గంభీర్ (35), రోహిత్ శర్మ, ధోనీ (31) లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక ముందు భారత్ ధీటైన లక్ష్యాన్ని ఉంచింది. వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభించడానికి వీల్లేక పోవడంతో అంపైర్లు ఓవర్లను కుదించి ఆట ప్రారంభించారు. 19 ఓవర్లో 100 పరుగుల మార్కును చేరుకున్న భారత్ మిగిలిన 10 ఓవర్లలో 95 పరుగులు సాధించింది. లంక బౌలర్లలో మలింగ, మహరూఫ్, కులశేఖర తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
Story first published: Tuesday, February 12, 2008, 13:07 [IST]
Other articles published on Feb 12, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications