Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

600 పరుగుల వద్ద శ్రీలంక డిక్లేర్

Mahela Jayawardane
కొలంబో: నలుగురు బ్యాట్స్ మెన్ సెంచరీలతో భారత్ తో జరుగుతున్న శ్రీలంక శుక్రవారంనాడు తొలి ఇన్నింగ్సును భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 600 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్సును శ్రీలకం డిక్లేర్ చేసింది. ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి శ్రీలంక ఆ స్కోరు చేసింది. భారత బౌలర్లెవరూ శ్రీలంక బ్యాట్స్ మెన్ పై ప్రభావం చూపలేకపోయారు. వర్ణపూర, సమరవీర, మహీల జయవర్ధనే, దిల్షాన్ సెంచరీలు చేశారు. దిల్షాన్ 125 పరుగులు చేసి నాటవుటుగా మిగలగా వర్ణపూర 115 పరుగులు చేయగా జయవర్థనే 136 పరుగులు చేశాడు. సమరవీర 127 పరుగులు చేశాడు. జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, హర్భజన్ లకు రెండేసి వికెట్లు వచ్చాయి.

తొలి రోజు ఆట వర్షం కారణంగా చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రోజు ఒక వికెట్ నష్టపోయి 85 పరుగులు చేసిన శ్రీలంక రెండో రోజు గురువారం చెలరేగి ఆడారు. భారత బౌలర్లు శ్రీలంక ఆటగాళ్లను ఏ మాత్రం ఇబ్బందులకు గురి చేయలేకపోయారు. కెప్టెన్ అనిల్ కుంబ్లేకు ఒక్క వికెట్ కూడా లభించలేదు.
Story first published: Friday, July 25, 2008, 14:04 [IST]
Other articles published on Jul 25, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+