హైదరాబాద్: కోచ్ పదవి నుంచి తనని అర్ధాంతరంగా తొలగించినందుకు నష్టపరిహారంగా 50 లక్షల డాలర్లు (రూ. 35 కోట్ల 89 లక్షలు) చెల్లించాలని శ్రీలంక జట్టు మాజీ కోచ్ చండిక హతురసింఘ శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం హతురసింఘ మరో 18 నెలలు కోచ్ పదవిలో కొనసాగాల్సి ఉన్నప్పటికీ బోర్డు అతడిని ముందుగానే తొలగించింది.
2019 ప్రపంచ కప్లో శ్రీలంక క్రికెట్ జట్టు దారుణ వైఫల్యం అనంతరం ఆ దేశ క్రికెట్ బోర్డు కోచ్ హతుర సింఘతో పాటు ఆయన శిక్షణ సహాయక సిబ్బందిని తొలగించింది. అర్ధాంతరంగా కోచ్ పదవి నుంచి తొలగించడంపై ఇది తన కోచింగ్ కెరీర్పై ప్రభావం చూపింస్తుందని లేఖలో పేర్కొన్నాడు. అయితే అతడికి పరిహారం చెల్లించడానికి లంక బోర్దు సిద్ధంగా లేదు.
నాలుగు రోజుల టెస్టు.. ఐసీసీ ప్రతిపాదనను వ్యతిరేకించిన పాంటింగ్!!
అయితే శ్రీలంక క్రికెట్ మాత్రం ఆరు నెలల వేతనాన్ని పరిహారంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో హతురసింఘకు చెల్లిస్తున్న వేతనంపై ఆ దేశ క్రీడాశాక మంత్రి హరిన్ ఫెర్మాండో అసంతృప్తి వ్యక్తం చేశాడు. నెలకు 60 వేల డాలర్లు తీసుకుని జట్టుని విజయ పథంలో నడిపించలేకపోతున్నాడని ఆయన విమర్శలు కురిపించాడు.
మీరు మాకు గర్వకారణం... ఇప్పుడు మా వంతు: కపిల్ బర్త్డే సందర్భంగా రణవీర్
కాగా, శ్రీలంక తరఫున హతురసింఘ 26 టెస్టులు, 35 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 1,274 పరుగులు, వన్డేల్లో 669 పరుగులు చేశాడు.