హైదరాబాద్: ఉపఖండంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేసిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా బంగ్లాదేశ్-శ్రీలంక-భారత్ జట్ల మధ్య ముక్కోణఫు టీ20 సిరిస్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో జగ్మోహన్ దాల్మియాకు నివాళిగా 'ఏ ట్రిబ్యూట్ టు జగ్గూ' శీర్షికతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల దాల్మియా క్రికెట్కు చేసిన సేవలను గుర్తు చేసుకున్నాడు. దాల్మియాను హీరోగా ఆయన అభివర్ణించారు.
అనుకున్నది సాధించాలనే పట్టుదలలో ఆయనలో ఉండేదని ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా శ్రీలంక క్రికెట్ ఎదుగుదలకు దాల్మియా చేసిన సాయం మరువలేనిదని చెప్పారు. శ్రీలంకకు దాల్మియా చేసిన సాయానికి గాను ఆయన మరణాంతరం ఈ విధంగా సత్కరించింది.
ఈ స్మారక పుస్తకాన్ని అందుకోవడానికి దాల్మియా కుమారుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) జాయింట్ సెక్రటరీ అవిషేక్ను బోర్డు ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్కు చెందిన కెప్లెన్లతో పాటు క్రికెటర్లు, ఐసీసీలో వివిధ హోదాల్లో పనిచేసిన ప్రముఖులు పాల్గొన్నారు.