హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్తో జరుగుతున్న రెండో వన్డే ద్వారా శ్రీలంక క్రికెట్ జట్టు అరుదైన ఘనత సాధించింది. పల్లెకెలె వేదికగా భారత్తో ఆడుతున్న వన్డే శ్రీలంకకు 800వ వన్డే కావడం విశేషం. కాండీ వన్డే ద్వారా 800 వన్డేలు ఆడిన జట్ల సరసన శ్రీలంక నిలిచింది.

ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, భారత్ దేశాలు 800లకు పైగా వన్డేలు ఆడాయి. ఇప్పటి వరకు శ్రీలంక మొత్తం 376 వన్డేల్లో గెలవగా, 386 వన్డేల్లో ఓడింది. మరో 5 వన్డే మ్యాచ్లు టై కాగా, 36 మ్యాచ్లకు ఫలితం తేలలేదు.