బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలంపాట రూపంలో మన లోకల్ టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్ ఓ గోల్డెన్ ఛాన్స్ లభించింది. జట్టు మొత్తాన్నీ పునర్వ్యవస్థీకరించడానికి అద్భుతమైన అవకాశం దక్కింది. ప్రస్తుతం సన్రైజర్స్లో కేప్టెన్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ మాత్రమే కొనసాగుతున్నారు. ఈ ముగ్గురినీ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకుంది. జట్టులోకి కొత్త ముఖాలను తీసుకోనుంది. రిటైన్ చేసుకున్న వారిలో కేన్ విలియమ్సన్ ఒక్కటే స్టార్ క్రికెటర్. మిగిలిన ఇద్దరూ అన్ క్యాప్డ్ ప్లేయర్లే.
22 మంది కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకోబోతోన్నందున- అభిమానుల ఫోకస్ మొత్తం ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ మీదే నిలిచింది. ఈ వేలంపాటలో పాల్గొనడానికి ఫ్రాంఛైజీ ఓనర్ కావ్య మారన్ బెంగళూరుకు చేరుకున్నారు. ఐటీసీ గార్డెనియా హోటల్కు చేరుకున్నారు. ఈ మెగా ఈవెంట్లో ఆమె సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచారు. ముదురు గోధుమ రంగు బ్లేజర్, బ్లాక్ కలర్ ప్యాంట్ను వేసుకుని కనిపించారామె. ఫ్రాంఛైజీ మెంబర్స్తో కలిసి ఆక్షన్లో పాల్గొన్నారు.
కేన్ విలియమ్సన్ కేప్టెన్సీలో ఆడబోయే జట్టును ఎంపిక చేసుకునే బాధ్యత ప్రస్తుతం కావ్య మారన్ మీద ఉంది. స్టార్ ప్లేయర్ల కోసం భారీగా కాంపిటీషన్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతే భారీగా ఖర్చు చేస్తే తప్ప మ్యాచ్ను గెలిపించే ప్లేయర్లను తీసుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. కావ్య మారన్కు నిజంగా ఇదొక టఫ్ టాస్క్. జట్టు క్రికెటర్ల ఎంపిక అనేది ఆమెకు అగ్నిపరీక్షగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎలా అధిగమించగలుగుతుందనేది ఆదివారం సాయంత్రానికి స్పష్టమౌతుంది. జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది తేలిపోతుంది.