న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్‌ గొప్ప మనసు.. కరోనా కట్టడి కోసం ఏకంగా 30 కోట్ల విరాళం! ఫాన్స్ ఫుల్ హ్యాపీ!

SRH donate Rs 30 crore to provide COVID-19 relief work those who affected by 2nd wave
SunRisers Hyderabad Owners Sun TV Donates Rs 30 Crore For COVID-19 Relief Work | Oneindia Telugu

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా తమ వంతు సాయాన్ని ప్రకటించింది. కరోనా మహమ్మారిపై భారత్‌ పోరులో భాగంగా రూ. 30 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం ప్రకటించింది. ఈ మొత్తాన్ని కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు అందజేయనున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు సోమవారం తన అధికారిక ట్వీటర్‌ అకౌంట్‌లో విరాళం విషయాన్ని స్పష్టం చేసింది. విషయం తెలిసిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా కరోనా నివారణ చర్యల్లో భాగంగా రూ. 10 కోట్లను సన్‌రైజర్స్‌ విరాళంగా ఇచ్చింది.

'కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా ప్రభావితమైన బాధితులకు అండగా ఉండేందుకు సన్‌ టీవీ నెట్‌వర్క్‌ రూ. 30 కోట్లను విరాళంగా ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతున్న వివిధ కార్యక్రమాలకు ఈ నిధులను ఉపయోగించనున్నాం. ఆక్సీజన్‌ సిలిండర్లు, మెడిసిన్‌ సరఫరా నిమిత్తం ఎన్జీఓలతో భాగస్వామ్యమై ముందుకు సాగుతాం.

ఇక మీడియా ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం' అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్వీట్ చేసింది.

IPL 2021: ధోనీ వికెట్ కోసం పంత్ ప్లాన్! అవేష్ ఖాన్‌కు ఢిల్లీ కెప్టెన్ ఏం చెప్పాడో తెలుసా?IPL 2021: ధోనీ వికెట్ కోసం పంత్ ప్లాన్! అవేష్ ఖాన్‌కు ఢిల్లీ కెప్టెన్ ఏం చెప్పాడో తెలుసా?

Story first published: Monday, May 10, 2021, 14:54 [IST]
Other articles published on May 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X