
350 లోపు కట్టడి చేశామంటే మా బౌలర్లు రాణించినట్లే
'30 ఓవర్లయ్యేసరికి ఆస్ట్రేలియా అత్యంత పటిష్టంగా ఉంది. అయినా వారిని 350 లోపు కట్టడి చేశామంటే మా బౌలర్లు బాగా రాణించినట్లే. ఛేదనలో మాకు మంచి ఆరంభం లభించింది. 330పై లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఓ మంచి భాగస్వామ్యం అవసరం. కానీ మేం అలాంటి భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయాం' అని కోహ్లీ అన్నాడు.

ఉమేశ్ యాదవ్, షమీని కొనియాడిన కోహ్లీ
ఇక అయితే పేసర్లు ఉమేశ్ యాదవ్, మొహ్మద్ షమీల బౌలింగ్ను కోహ్లీ ప్రత్యేకంగా కొనియాడాడు. వారిద్దరూ మంచి బౌలింగ్ బాగా చేశారని పొగిడాడు. ఉమేశ్, షమీల బౌలింగ్ ఆకట్టుకుంది. ఆ ఇద్దరూ తమవంతు న్యాయం చేశారు. కాకపోతే ఎల్లప్పుడూ స్పిన్నర్లు రాణించాలనుకోవడం కరెక్ట్ కాదు. అన్ని రోజులు స్పిన్నర్లదే కాదు. ఇక్కడ ఆసీస్ బ్యాటింగ్ చాలా బాగుంది' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఆసీస్ అమలు చేసిన విధానం చాలా చక్కగా ఉంది
'బ్యాటింగ్లో ఆసీస్ అమలు చేసిన విధానం చాలా చక్కగా ఉంది. మా వ్యూహాల్ని వారు వెనక్కినెట్టి పైచేయి సాధించారు. నాలుగో వన్డేలో తామేమీ మరీ చెత్తగా అయితే ఆడలేదు. కానీ ఆసీస్ మా కంటే మంచిగా ఆడింది' అని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే విజయానికి చేరువగా వచ్చి ఓడి పోవడంపై కూడా కోహ్లీ స్పందించాడు.

టీమిండియా ఓటమికి కారణం ఇదీ
తమ ఓపెనర్లు చక్కటి భాగస్వామ్యాన్ని ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమైనట్లు పేర్కొన్నాడు. తమకు ఓటమికి ప్రధాన కారణం ఓపెనింగ్ తరహా భాగస్వామ్యం మరొకటి చేయకపోవడమేనని కోహ్లీ చెప్పాడు. అందువల్లే నాలుగో వన్డేలో ఓడిపోయామని కోహ్లీ అన్నాడు.


Click it and Unblock the Notifications











