Virat Kohli-Rohit Sharma: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మే 7న టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించిన కేవలం 5 రోజుల తర్వాత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా మే 12న టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన అనంతరం టీ20 ఫార్మాట్ నుంచి వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా అద్భుతమైన వీడ్కోలు పలకడానికి సన్నాహాలు చేస్తోంది.
కోహ్లీ-రోహిత్కు ప్రత్యేక వీడ్కోలు
టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మంచి వీడ్కోలు లభించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో వన్డే ఫార్మాట్లో మాత్రమే కనిపిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ టీమిండియా 3 వన్డే మ్యాచ్లు ఆడాల్సి ఉంది. నివేదికల ప్రకారం.. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ పర్యటనను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు సిరీస్గా సిద్ధం చేస్తోంది. ఆటగాళ్లుగా ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు ఇది చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దీనిని చాలా ప్రత్యేకంగా చేయాలనుకుంటోంది.

వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడనున్న ఇద్దరు దిగ్గజాలు
భారత క్రికెట్కు సుదీర్ఘకాలం సేవలు అందించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు తమ కెరీర్ చివరి దశలో ఉన్నారు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు వన్డే ప్రపంచ కప్ 2027 వరకు ఆడాలని కోరుకుంటున్నారు. ఇద్దరూ తదుపరి ప్రపంచ కప్ను గెలిచి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఐపీఎల్ 2025లో కూడా తన ఫామ్ను నిరూపించుకున్నాడు. చివరి మ్యాచ్లలో రోహిత్ శర్మ కూడా తన బ్యాట్తో జట్టు కోసం కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.