న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ ఆడని క్రిస్టియానో రొనాల్డో.. కోర్టుకెక్కిన అభిమానులు.. చివరికి ఏమైందంటే ?

సియోల్‌: పోర్చుగల్ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మైదానంలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. రొనాల్డో మ్యాచ్ ఆడుతున్నాడు అంటే.. టికెట్లు క్షణాల్లో అమ్ముడవుతాయి. మరి ఈ సాకర్ దిగ్గజం మైదానంలోకి దిగకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తాజాగా నిరూపితమైంది. గతేడాది వేసవిలో సియోల్‌లో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో మ్యాచ్ ఆడకపోవడంతో ఇప్పుడు తిరిగి డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయంలోకి వెళితే...

హామిల్టన్‌లో అయ్యర్ అరుదైన ఘనత.. సెహ్వాగ్‌ తర్వాత ఆ రికార్డు శ్రేయాస్‌దే!!హామిల్టన్‌లో అయ్యర్ అరుదైన ఘనత.. సెహ్వాగ్‌ తర్వాత ఆ రికార్డు శ్రేయాస్‌దే!!

హాట్ కేకుల్లా టికెట్లు:

హాట్ కేకుల్లా టికెట్లు:

గతేడాది జూలైలో 'ది ఫాస్టా' అనే సంస్థ కె-లీగ్‌ ఆల్‌స్టార్స్, యువెంటాస్‌ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించింది. ది ఫాస్టా సంస్థ పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో యువెంటాస్‌ తరఫున బరిలోకి దిగుతాడని ప్రచారం చేసింది. రొనాల్డో కనీసం 45 నిమిషాలు మ్యాచ్ ఆడతాడని అభిమానులకు చెప్పింది. రొనాల్డోకు ఉన్న క్రేజ్ కారణంతో 65 వేల టికెట్లు కేవలం మూడు నిమిషాల్లోపే అమ్ముడు పోయాయి. కొరియా కరెన్సీలో 30,000 వన్‌ల నుంచి 4,00,000 వన్‌ల వరకు (రూ.1800-రూ. 24,000) వెచ్చించి అభిమానులు టికెట్లు కొన్నారు.

బెంచ్‌కే రొనాల్డో:

బెంచ్‌కే రొనాల్డో:

మ్యాచ్‌ రోజు సియోల్‌ స్టేడియానికి వచ్చి చూస్తే రొనాల్డో బెంచ్‌కే పరిమితమయ్యాడు. కనీసం మైదానంలో అడుగే పెట్టలేదు. దీంతో అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. కనీసం పది నిమిషాలైనా రొనాల్డో మ్యాచ్ ఆడిఉంటే.. కొరియన్లంతా ఎంతో సంతోషంగా ఉండేవారు. రొనాల్డో మ్యాచ్ ఆడకపోవడంతో నిరాశ చెందిన ఇద్దరు కొరియన్ అభిమానులు కోర్టులో కేసు వేశారు. విచారించిన ఇంచ్‌యోన్‌ జిల్లా కోర్టు ఒక్కొక్కరికి 3,71,000 వన్‌లు (రూ.22,285) చెల్లించాలని 'ది ఫాస్టా' సంస్థను మంగళవారం ఆదేశించింది. కోర్టు తీర్పుతో అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు.

రొనాల్డో సరికొత్త రికార్డు:

రొనాల్డో సరికొత్త రికార్డు:

రొనాల్డో మైదానంలోనే కాదు సోషల్‌ మీడియాలో కూడా తనకు ఎదురులేదని తాజాగా నిరూపించాడు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న రొనాల్డో.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 200 మిలియన్ల ఫాలోవర్ల మార్కు దాటేశాడు. ఈ మైలురాయిని దాటిని తొలి వ్యక్తి రొనాల్డోనే కావడం విశేషం. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఇన్‌స్టాగ్రమ్ అధికారిక ఖాతా (330.5 మిల్లియన్ల ఫాలోవర్స్‌)కు మాత్రం రొనాల్డో వెనుకున్నాడు.

330 మిలియన్ల ఫాలోవర్లు:

330 మిలియన్ల ఫాలోవర్లు:

సోషల్‌ మీడియాలో మొత్తంగా 330 మిలియన్ల మంది రొనాల్డోను ఫాలో అవుతున్నారు. హాలీవుడ్ సింగర్ అరియానా గ్రాండే 173.1 మిల్లియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. డ్వేన్‌ జాన్సన్‌ (170 మిలియన్లు), సెలెనా గోమేజ్‌ (167 మిలియన్లు), కైలీ జెన్నెర్‌ (160 మిలియన్లు), కిమ్‌ కర్దాషియన్‌ (158 మిలియన్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. రొనాల్డో ప్రత్యర్థి లియోనల్ మెస్సీ 141.8 మిల్లియన్ల ఫాలోవర్లతో ఏడో స్థానంలో ఉన్నాడు.

ప్రతి పోస్టుకు 9 లక్షల యూరోలు:

ప్రతి పోస్టుకు 9 లక్షల యూరోలు:

రొనాల్డో తన ఆటతో కంటే పోస్ట్‌ల ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ అయిన రొనాల్డో తన ప్రతి స్పాన్సర్డ్‌ పోస్టుకు 9 లక్షల యూరోలు (సుమారు రూ. 7 కోట్ల 10 లక్షలు) సంపాదిస్తున్నాడట. వీటి ద్వారానే అతనికి ఏడాదికి 48 మిలియన్ల యూరోల (సుమారు రూ. 379 కోట్లు) ఆదాయం వస్తోంది.

Story first published: Wednesday, February 5, 2020, 15:13 [IST]
Other articles published on Feb 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X