
తొలి రెండు మ్యాచ్లపైనా..
ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతం మీదుగా లా నినా విస్తరించింది. వచ్చే నాలుగైదు రోజుల్లో ఇది మరింత విస్తృతమౌతుందని బ్యూరో ఆఫ్ మెటెరాలజీ వివరించింది. మెల్బోర్న్ గీలాంగ్లోని సైమండ్స్ స్టేడియం వేదికగా జరుగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావడానికే అధిక అవకాశాలు ఉన్నాయి. ఇదొక్కటే కాదు.. శనివారం షెడ్యూల్ అయిన ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్ కూడా రద్దు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

మెల్బోర్న్లో..
టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్లో మధ్యాహ్నం 1:30 గంటలకు జరగాల్సిన మొట్టమొదటి మ్యాచ్ ఇది. సిడ్నీలో శనివారం వర్షం పడటానికి 90 శాతం మేర అవకాశాలు ఉన్నాయని బ్యూరో ఆఫ్ మెటెరాలజీ తెలిపింది. మూడు మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావొచ్చనీ అంచనా వేసింది. మెల్బోర్న్లో రాత్రి వేళ 10 నుంచి 25 మిల్లీమీటర్ల వరకు వర్షం పడటానికి 90 శాతం వరకు అనుకూల వాతావరణం ఉన్నట్లు వెల్లడించింది.

ఆలస్యంగా వామప్..
దీనికి ముందస్తు సూచిక అన్నట్టుగా ఇవ్వాళ జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ వామప్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. బ్రిస్బేన్లో భారీ వర్షం పడటం వల్ల ఆలస్యంగా టాస్ పడనుంది. సాయంత్రం 4:30 గంటలకు టాస్ పడే అవకాశం ఉంది.. అప్పటికీ వాతావరణం సహకరిస్తేనే. లేదంటే పూర్తిగా రద్దు అవుతుందీ మ్యాచ్.

రెండూ రద్దు..
బ్రిస్బేన్లోనే షెడ్యూల్ అయిన దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దయింది. ఒక్క బంతి కూడా పడే పరిస్థితి లేకపోవడం వల్ల మ్యాచ్ మొత్తానికే రద్దయింది. ఇక పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 2.2 ఓవర్లల్లో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం పడటంతో మ్యాచ్ను రద్దు చేశారు.

రిజర్వ్ డే ఇలా..
టీ20 ప్రపంచకప్ 2022 గ్రూప్స్, సూపర్ 12 దశలో రిజర్వ్ డేలు లేవు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్కు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. మ్యాచ్ కొనసాగాలంటే కనీసం అయిదు ఓవర్లయినా పడాల్సి ఉంటుంది. అయిదు ఓవర్లు కూడా వేయలేని పరిస్థితి ఉంటే మ్యాచ్ రద్దవుతుంది. ఫలితంగా.. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్పై ఇప్పటి నుంచే అనుమానాలు ఏర్పడుతున్నాయి.


Click it and Unblock the Notifications












