వరుసగా తొమ్మిది సార్లు
ఉపఖండంలో డుప్లెసిస్ వరుసగా తొమ్మిది సార్లు టాస్ ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో టాస్ సమయంలో తన స్థానంలో వేరొకరిని పంపించాలని డుప్లెసిస్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు మూడో టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో డుప్లెసిస్ మాట్లాడాడు.
నా స్థానంలో వేరొకరిని
"రేపటి టాస్కు నా స్థానంలో వేరొకరిని పంపుతాను. ఎందుకంటే నా రికార్డ్ ఇప్పటివరకు గొప్పగా లేదు. అవును, మొదటి ఇన్నింగ్స్లో స్కోరు బోర్డుపై భారీ పరుగులు చేయాలి. ఆ విధంగా మేము ప్రారంభించాలి" అని డుప్లెసిస్ తెలిపాడు. ఈ సిరిస్లో ఇప్పటివరకు సఫారీలు ఆడిన రెండు తొలి ఇన్నింగ్స్ల్లోనూ నిరాశపరిచారు.
తొలి ఇన్నింగ్స్లో 431 పరుగులకే
విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 431 పరుగులకే పరిమితమైన దక్షిణాఫ్రికా... పూణె వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 275 పరుగులకే కుప్పకూలింది. మరోవైపు విశాఖ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 502 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
రాంచీ వేదికగా మూడో టెస్టు
ఇక, పూణె టెస్టు తొలి ఇన్నింగ్స్లో 601/5 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో మరో టెస్టు మిలిలుండగానే సిరిస్ను 2-0తో కైవసం చేసుకుంది. పూణె టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరిస్లను నెగ్గిన ఏకైక జట్టుగా కోహ్లీసేన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా... పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.