అప్పటి బ్లేజర్ రోజు ధరించాలనుకున్నా
మీడియా సమావేశానికి టీమిండియా బ్లేజర్ ఎందుకు వేసుకొచ్చారో సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చారు. గంగూలీ మాట్లాడుతూ... 'నేను 2000 సంవత్సరంలో భారత జట్టుకు కెప్టెన్గా ఉన్న సమయంలో ఈ బ్లేజర్ నాకు ఇచ్చారు. అప్పటి బ్లేజర్ను ఈ రోజు ధరించాలని నిర్ణయింకున్నా. కానీ.. బ్లేజర్ చాలా లూజ్గా ఉన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయా' అని విలేకరులతో నవ్వుతూ చెప్పారు.
బీసీసీఐ పదవి గౌరవంగా భావిస్తున్నా
'బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నా. భారత క్రికెట్కు మేలు చేసేందుకే ఇక్కడ ఉన్నాం. క్రికెట్ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం ఎంతో సంతోషంగా ఉంది. బీసీసీఐ నిర్వహణలో ఎటువంటి లోపం ఉండదు. బోర్డులో ఎటువంటి అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటాం. అందరికీ బోర్డు ఒకేలా ఉంటుంది. నేను టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన తరహాలోనే.. బీసీసీఐని కూడా ముందుకు నడిపిస్తా' అని గంగూలీ అన్నారు.
కోహ్లీకి మద్దతు ఇస్తాం
'ప్రస్తుతం భారత క్రికెట్లో అత్యంత ప్రధానమైన వ్యక్తి కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతడికి అన్ని విధాలా మద్దతు ఇస్తాం. కోహ్లీతో రేపు సమావేశమవుతా. గత మూడు నాలుగేళ్లలో టీమిండియా అద్భుత విజయాలను సాధించింది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టినందున భారత జట్టు కెప్టెన్, కోచ్ గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదు' అని దాదా పేర్కొన్నారు.
ధోనీతో మాట్లాడుతా
'భారత క్రికెట్లో ఎంఎస్ ధోనీది ప్రత్యేక స్థానం. ఆటగాడిగా, కెప్టెన్గా టీమిండియాకు ఎన్నో అపూర్వ విజయాలను అందించాడు. అతని పట్ల భారత్ గర్వంగా ఉంది. ధోనీ రిటైర్మెంట్ విషయం అతడి చేతుల్లోనే ఉంది. కెరీర్ గురించి అతడి ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి. ధోనీతో మాట్లాడుతా' అని దాదా చెప్పుకొచ్చారు.
2008లో ఆటకు వీడ్కోలు:
గంగూలీ కెరీర్లో 113 టెస్ట్లు, 311 వన్డేలు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసాడు. గంగూలీ కెరీర్ 1996లో టెస్ట్ల్లో ఆడడం ప్రారంభించాక కొత్త శిఖరాలకు చేరింది. 2000 నుంచి 2005 వరకు భారత సారథిగా వ్యవహరించిన దాదా.. 2008లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2003లో టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్లోకి తీసుకెళ్లాడు. రిటైర్మెంట్ అనంతరం కొద్ది సీజన్ల పాటు ఐపీఎల్లో ఆడాడు. ఇక 2015లో తొలిసారి క్యాబ్ చీఫ్గా ఎన్నికైన గంగూలీ ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో ఉన్నాడు.