
కేసీబీలో గంగూలీ, సెహ్వాగ్:
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) 13వ సీజన్ తొలి వారంలో సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో వైరల్గా మారింది. కెరీర్ సహా అనేక విశేషాలు పంచుకున్న దాదా, వీరూ.. ఏకంగా కేబీసీ హోస్ట్, బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్నే హాట్సీట్లో కోర్చుబెట్టారు. గంగూలీ అడిగిన ప్రశ్నలకు బిగ్బీ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ షోలో గంగులీ, సెహ్వాగ్ రూ.25లక్షలు గెలుచుకున్నారు. అయితే రూ.50 లక్షల ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే తాము గెలుచుకున్న రూ.25 లక్షలను ధార్మిక పనుల కోసం భారత మాజీలు విరాళంగా ఇచ్చారు.

బిగ్బీనే హాట్సీట్లో కూర్చోబెట్టిన దాదా:
కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) షో అంతలా పాపులర్ అవ్వడానికి అమితాబ్ బచ్చన్ కూడా ఓ కారణమనే చెప్పాలి. తన వ్యాఖ్యానం, హావభావాలతో అభిమానులను ఎంతగానో ఆకటుకున్నారు. ఈ షోలో సాధారణంగా అమితాబ్ బచ్చన్ అందరినీ ప్రశ్నలడిగితే.. ఆయన సీటును సౌరవ్ గంగూలీ తీసుకొని బిగ్బీని హాట్సీట్లో కూర్చోబెట్టాడు. బిగ్బీకి వరుసగా క్రికెట్ ప్రశ్నలు వేశాడు. అందుకు వీరూ సాయం కూడా తీసుకోమన్నాడు. కొన్నింటికి అమితాబ్ సమాధానాలు చెప్పలేకపోయారు. ఇలా యాంకర్గా దాదా అదరగొట్టాడు. దాదా ప్రతిభను చూసిన బిగ్బీ.. ముగ్దుడయ్యారు. 'ఇలాగే కొనసాగితే నా పనికే ఎసరు పెడతారేమో' అని బిగ్బీ సరదాగా వ్యాఖ్యానించారు. దానికి దాదా కూడా తనదైన శైలిలో జవాబిచ్చాడు. 'ఒకవేళ నేను హోస్ట్గా చేయాల్సి వస్తే.. ముందుగా మీ వీడియోలు చూసి నేర్చుకుంటా' అంటూ భారత మాజీ కెప్టెన్ నవ్వులు పూయించారడు.

సెహ్వాగ్ హాస్యం:
ఇక డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన రీతిలో హాస్యం పండించాడు. తాను ఆడే రోజుల్లో జట్టు సభ్యులతో, మైదానంలో ఎలా పంచులు వేశేవాడో.. కేసీబీలో కూడా అలానే సందడి చేశాడు. తన కెరీర్ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఇక భరత జట్టుకు అవసరమైన ప్రతిసారీ అప్పటి కెప్టెన్ అయినా సౌరవ్ గంగూలీ తనపై ఆధారపడేవాడని చెప్పుకొచ్చాడు. వేగంగా పరుగులు చేయాలన్నా, దూకుడుగా ఆడాలన్నా, ఫీల్డింగ్ అవసరమైనా, బౌలింగ్ చేయాలన్నా, జట్టుకు విజయం అందించాలన్నా తనను దాదా ఎప్పుడూ ఉపయోగించుకొనేవాడని వీరూ చెప్పాడు.
50 లక్షలు గెలవలేకపోయారు:
ఈ షోలో సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ రూ.25లక్షలు గెలిచారు. అయితే రూ.50 లక్షల ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేకపోయారు. ఆ ప్రశ్న ఏంటంటే.. ఆజాద్ హింద్ రేడియో సేవలు మొదట నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో 1942లో ఏ దేశంలో మొదలయ్యాయి?. జపాన్, జర్మనీ, సింగపూర్, బర్మా.. ఆప్షన్స్ ఇవ్వగా దాదా, వీరూ నిర్దేశిత సమయంలో జవాబు చెప్పలేదు. దాంతో భారత మాజీలు రూ.50 లక్షలు గెలవలేకపోయారు. సరైన సమాధానం జర్మనీ. అయితే గెలుచుకున్న రూ.25 లక్షలను ధార్మిక పనుల కోసం వారు విరాళంగా ఇచ్చారు. ఈ షో సాంతం ఆసక్తికరంగా సాగినట్టు సమాచారం. దాదా భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. ఇక వీరూ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు.


Click it and Unblock the Notifications
